ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే
x

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే

దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ సిలీండర్లు. ఒకే సారి మూడు సిలీండర్లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలీండర్‌ ఇవ్వాలని నిర్ణయం.


సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం అమరావతి సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలీండర్లు ఇవ్వాలనే నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నగదు చెల్లించి సిలీండర్‌ కొనుగోలు చేస్తే, తిరిగి 48 గంటల్లో ఆ నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఉచిత సిలీండర్ల పథకానికి ఏడాదికి రూ. 2,700 కోట్లు భారం పడుతుందని అంచనా వేశారు. దీంతో పాటుగా ఉచిత ఇసుకలో సీనరేజ్, జీఎస్టీ చార్జీల రద్దుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేవలం సీనరేజ్‌ చార్జీల రద్దు వల్ల ప్రభుత్వంపై రూ. 264 కోట్లు భారం పడుతుందని అంచనా వేశారు. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇసుక లేని జిల్లాల్లో మినరల్‌ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలనే అంశంపైన చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించడంతో పాటు మెంబర్ల సంఖ్య పెంచేందుకు అవసరమైన చట్ట సవర చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. గత జగన్‌ ప్రభుత్వం విశాఖపట్నం శారదాపీఠానికి ఇచ్చిన 15 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవాలనే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

Read More
Next Story