
ఏపీలో దొంగ పెన్షనర్లు 3.20లక్షల మంది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పెన్షనర్లను దొంగలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ పెన్షన్లు తీసుకుంటున్న వారిని దొంగలు అనకుండా ఏమనాలని ప్రశ్నించారు. విశాఖటప్నంలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 3.20లక్షల మంది దొంగ పెన్షనర్లు ఉన్నారని, వీరిని తొలగించాల్సిందేనని అన్నారు. ఈ దొంగ పెన్షనర్ల వల్ల ప్రభుత్వానికి పెద్ద నష్టం కలుగుతోందన్నారు. ఈ దొంగ పెన్షన్ల కోసం నెలకు రూ. 120 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వస్తోందని, ఏడాదికి రూ. 1440 కోట్లు పక్కదారి పడుతున్నాయని అన్నారు. ఎవరు ఏమనుకున్నా తనకు అవసరం లేదని.. ఈ దొంగ పెన్షన్లను తొలగించాల్సిందేనని సంచలన వాఖ్యలు చేశారు.
Next Story