
ట్రాక్టర్ను ఢీకొట్టిన స్కార్పియో
చిన్నారితో సహా ముగ్గురు మృతి, కర్నూల్ జిల్లాలో దారుణం
కర్నూల్ జిల్లాలో ఈ తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలిగొంది. ఈ దుర్ఘటనలో ఓ చిన్నారితో సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం కడప జిల్లా మైదకూరుకు స్కార్పియో వాహనంలో బయలుదేరింది. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకు చేరుకోగానే, రోడ్డు పక్కన ఉన్న ట్రాక్టర్ను వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వేగంగా ఢీకొట్టింది.అతివేగంగా ఢికొట్టడంతో స్కార్పియో నుజ్జునుజ్జయ్యింది.
ఈ వాహనంలో తొమ్మిది మంది ప్రయాణిస్తుండగా ,మున్ని (35), షేక్ కమాల్ బాషా (50)ప్రమాదస్థలంలోనే మరణించారు.మూడేళ్ల చిన్నారి నదియా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కన్ను మూసింది. గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు.గాయపడిన మిగిలిన ఐదుగురికి చికిత్స అందుతోంది.