
పది లక్షల కంటే మించిన పనులకు టెండర్లు
ఇరిగేషన్ పనులు, నిర్వహాణ, మరమ్మత్తుల కోసం సీఎం చంద్రబాబు రూ.344 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఇరిగేషన్ పనులు, నిర్వహణ, మరమ్మత్తుల కోసం సీఎం చంద్రబాబు రూ. 344 కోట్లు మంజూరు చేశారని, వీటిల్లో రూ. 10లక్షలకు మంచిన పనుల కోసం టెండర్లు పిలవాలని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఈనెలాఖరు నాటికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ ఓ అండ్ ఎం పనులపై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో సోమవారం మంత్రి నిమ్మల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓ అండ్ ఎం పనుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయటం సంతోషకరమని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదలు పెట్టడానికి ముందే పూర్తి చేయాలని మంత్రి సూచించారు. దీనికి సంబంధించి నిత్యం పర్యవేక్షణ అవసరమని, సూపరిండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు ఆ పని చేయగలిగితే వాటిని సకాలంలో పూర్తి కాగలవని అధికారులకు సూచించారు.