తెలంగాణ..ఆంధ్ర వేరైనా తెలుగు జాతి ఒక్కటే
x

తెలంగాణ..ఆంధ్ర వేరైనా తెలుగు జాతి ఒక్కటే

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.


జూన్‌ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. జూన్‌ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలు.. తెలుగు జాతి ఒక్కటే అని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా.. వారు సమున్నతంగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అంటూ సోమవారం సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

చంద్రబాబు ఏమన్నారంటే..
తెలుగు రాష్ట్రాలు వేరైనా.. తెలుగు ప్రజలు.. తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన.. ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని, అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ వికసిత్‌ భారత్‌–2047 నాటికి అగ్రస్థానానికి చేరుకోవాలని, తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలని.. ఇందులో ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిస్తున్నాను. అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

Read More
Next Story