
తెలంగాణ..ఆంధ్ర వేరైనా తెలుగు జాతి ఒక్కటే
నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలు.. తెలుగు జాతి ఒక్కటే అని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా.. వారు సమున్నతంగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అంటూ సోమవారం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
#TelanganaFormationDay
— N Chandrababu Naidu (@ncbn) June 2, 2025
తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో…