
మంగళగిరిలో తెలంగాణ మంత్రుల సందడి
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెలిప్యాడ్లో ల్యాండ్ అయిన మంత్రులు.
తెలంగాణ కు చెందిన 5గురు మంత్రులు ఏపీ పర్యటించడంతో ఆదివారం సందడి నెలకొంది.తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు , మంగళగిరికి వచ్చారు. వీరంతా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన ఆఫీస్ ప్రాంగణానికి విచ్చేశారు.వారు ప్రయాణించిన హెలికాప్టర్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెలిప్యాడ్లో ల్యాండ్ అయింది.ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రులు మంగళగిరి వచ్చారు.

తెలంగాణ మంత్రులు విచ్చేసిన సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరఫున శాసనమండలి విప్ పి. హరిప్రసాద్, ఇతర జనసేన నాయకులు వారికి స్వాగతం పలికారు. కార్యక్రమం ముగిసిన తరువాత తెలంగాణ మంత్రులకు కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలు బహూకరించి జనసేన నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు.
Next Story