
మొదటి స్థానంలో తెలంగాణ..ఏడో స్థానంలో ఏపీ
ఆరవ ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలల (ఈఎంఆర్ఎస్) జాతీయ సాంస్కృతిక, సాహిత్య, కళా ఉత్సవాలు ఉద్భవ్ - 2025 ఘనంగా ముగిసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేఎల్ యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈఎంఆర్ఎస్ సాంస్కృతిక, సాహిత్య , కళా ఉత్సవ్ ఉద్భవ్ -2025 లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవగా, ఆతిధ్య ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏడో స్థానంలో నిలిచింది. శుక్రవారం ఈ ఉత్సవ్ బహుమతి ప్రధానోత్సవ వేడుకలు విద్యార్థుల కేరింతలు, ఆనందోత్సవాల మధ్య ఉత్సాహంగా కొనసాగింది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి , జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమం, గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామ వార్డు వాలంటీర్లు శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళ, శిశు సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ మల్లికార్జున్ నాయక్,, డైరెక్టర్ భార్గవి, ఎన్ ఈ టీ ఎస్ జాయింట్ కమిషనర్ బిపిన్ చంద్ర రాటురి, రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ గౌతమి 47 విభాగాల్లో మొదటి ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు బహుమతులు అందజేశారు.

