తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు ఉత్తరాంధ్ర అయ్యప్పల మృతి
x

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు ఉత్తరాంధ్ర అయ్యప్పల మృతి

మృతుల్లో ఐదుగురు ఏపీకి చెందినవారని తమిళనాడు పోలీసులు తెలిపారు


తమిళనాడులో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప స్వాములు మరణించారు. వీరందరూ ఉత్తరాంధ్ర వాసులని తెలుస్తోంది. రామనాథపురం జిల్లాలో ఆగి ఉన్న కారును ఓ లారీ ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు(ఉత్తరాంధ్ర) చెందిన వాళ్లని తమిళనాడు పోలీసులు చెబుతున్నారు.
ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్‌ వద్ద కారు ఆపి అయ్యప్పలు నిద్రిస్తున్న సమయంలో లారీ ఢీ కొన్నట్టు సమాచారం.
మృతుల్లో ఐదుగురు ఏపీకి చెందినవారని తమిళనాడు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ ముస్తాక్‌ కూడా అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. గాయపడిన వాళ్లకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తుండగా లారీ వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో మరణించారు. మృతుల్లో నలుగురు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస వాసులుగా గుర్తించారు. మరొకరిని గజపతినగరం మండలం మరుపల్లివాసిగా గుర్తించారు.
శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం.. అక్కడి నుంచి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పొగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. వాళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More
Next Story