రేపు తల్లికి వందనం
x

రేపు 'తల్లికి వందనం'

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి లోకేష్‌ తెలిపారు.


జూన్‌ 12న విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. మరో వైపు జూన్‌ 12తో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాలం పూర్తి అవుతుంది. రెండు సందర్భాలు ఒకే రోజు వస్తుండటంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు సందర్భాలను పురస్కరించుకుని గురువారం నాడు 'తల్లికి వందనం' పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు.. అందరికీ గుడ్‌ న్యూస్‌ అని లోకేష్‌ తెలిపారు. తల్లికి వందనం పథకానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందతుంది అంటూ పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు రూ. 8745 కోట్లు వారి తల్లలు ఖాతాల్లో జమచేస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

లోకేష్‌ ఏమన్నారంటే..
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్‌ న్యూస్‌. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం. సూపర్‌ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం చాలా సంతోషం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ’తల్లికి వందనం’ పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్‌ పొందే పిల్లలు, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తాం. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం–2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది.

Read More
Next Story