నింగిలోకి దూసుకెళ్లిన SSLV - D3 శాటిలైట్-8
x

నింగిలోకి దూసుకెళ్లిన SSLV - D3 శాటిలైట్-8


తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌ నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 ను నింగిలోకి పంపింది ఇటీవల ఇస్రో రూపొందించిన చిన్నపాటి ఉపగ్రహ వాహన నౌక ఎఎస్ఎస్ఎల్వీ-డీ3 శుక్రవారం ఉదయం 9.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది . ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం తెల్లవారుజామున 2.47 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. దీని ద్వారా 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతామని ఇస్రో ప్రకటించింది.ఇస్రోకు చెందిన యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో భూ పరిశీలనల కోసం ఏర్పాటు చేసిన. ఎలక్ట్రో ఆప్టికల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఈవోఐఆర్‌, పేలోడ్‌ మిడ్‌-వేవ్, లాంగ్‌ వేవ్‌ ఇన్‌ఫ్రా-రెడ్‌లు ఫోటోలను క్యాప్చర్‌ చేస్తుంది. ఇవి సేకరించే సమాచారం సాయంతో వాతావరణం, విపత్తులపై అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు సేవలు అందిస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. అంతేకాదు, ఇది SSLV డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు అవకాశాలను తెరిచి, సరికొత్త మిషన్లకు శ్రీకారం చుడుతుందని పేర్కొంది. ఇస్రో రూపొందించిన ఎస్ఎస్ఎల్వీ చాలా ప్రత్యేకమైన రాకెట్. దీన్ని కేవలం 72 గంటల వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. ముఖ్యంగా దీని ద్వారా నింగిలోకి ఉపగ్రహాలను తీసుకెళ్లేందుకు చాలా తక్కువ ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఇస్రో వాణిజ్య ప్రయోగాల సంఖ్య రెట్టింపవుతుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష వాణిజ్యంలో భారత్ వాటా మెరుగుపడేందుకు దోహదం చేస్తోంది EOS-08 ఉపగ్రహ మిషన్ ప్రధాన లక్ష్యాలు మైక్రో-శాటిలైట్‌ను రూపొందించడం, అభివృద్ధి చేయడం. మైక్రో శాటిలైట్‌కు అనుకూలంగా ఉండే వాహక నౌక పేలోడ్ సెన్సార్‌లను సృష్టించడం, భవిష్యత్తులో ఉపగ్రహా కార్యకలాపాలకు అవసరమైన కొత్త సాంకేతికతలను పొందుపరచడం.అయితే, 2022లో తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం విఫలమైంది. దీంతో లోపాలను సరిచేసిన ఇస్రో గతేడాది మరో ప్రయోగం నిర్వహించి విజయవంతమైంది. దీంతో తాజా ప్రయోగం కూడా విజయవంతం కావడంతో ఈ ఉపగ్రహం సేకరించే సమాచారం సాయంతో వాతావరణం, విపత్తులపై అధ్యయనం చేయనున్నారు


Read More
Next Story