TTD|| స్వర్ణరథంపై ఊరేగిన దేవదేవుడు..!
x

TTD|| స్వర్ణరథంపై ఊరేగిన దేవదేవుడు..!

పెద్ద సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొని శ్రీ‌వారి స్వర్ణ రథాన్ని లాగారు.


శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమ‌వారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు బంగారు తేరులో విహరిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం.

స్వ‌ర్ణ‌ ర‌థోత్స‌వంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌, జేఈవో వీర‌బ్ర‌హ్మం, సీవీఎస్వో ముర‌ళీకృష్ణ‌, సీఈ సత్యనారాయణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


Read More
Next Story