విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన షర్మిల
x

విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన షర్మిల

రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ షర్మిల డెడ్ లైన్ విధించారు. ఈ నెల 4న మధ్యాన్నం ఒంటి గంట లోపు తొలగించిన 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లో తీసుకోవాలి.


విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం కోసం ఎందాకైనా పోతామని పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. బుధవారం ఆమె స్టీల్ ప్లాంట్ ముందు ధర్నా చేసి మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే...

నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా, 4,200 మంది కార్మికులను అన్యాయంగా తొలగించారు. నోటీసు ఇవ్వకుండా తొలగించడం దుర్మార్గం. విశాఖ స్టీల్ ఆంధ్రులకు తలమానికం. కాంగ్రెస్ హయంలో ప్లాంట్ లాభాల్లో ఉంది. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయే సరికి ప్లాంట్ ను నీరు గార్చారు. అంచెలంచెలుగా ప్లాంట్ ను దెబ్బ తీశారు. ఇది చాలా దుర్మార్గం. 32 మంది బలిదానాలు తో ప్లాంట్ ఏర్పడింది. ఎంతో మంది భూములు స్వచ్చందంగా ఇచ్చారు. విశాఖ కు సొంత మైన్ లేదు. ప్లాంట్ కి ఇచ్చే ముడిపదార్ధాలు ధరలు పెంచారు. పాలకులు సిక్ ఇండస్ట్రీ గా మార్చారు. అవిటి ప్రాజెక్టు, కుంటి ప్రాజెక్టు గా చిత్రీకరిస్తున్నారు. నష్టాల సాకు చూపి అమ్మాలని చూస్తున్నారు.
ఆదుకొనే చిత్తశుద్ది ఎవరికి లేదు. కాంగ్రెస్ హయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఈ ప్లాంట్ విస్తరణ చేశారు. 3 మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి 7 మిలియన్ టన్నులు పెంచారు. 20 మిలియన్ టన్స్ కి పెంచేలా బ్లూ ప్రింట్ రెడీ చేశారు. ఒకప్పుడు 7 మిలియన్ టన్స్ ఉత్పత్తిచేసే ప్లాంట్ ని 1 మిలియన్ టన్స్ కి తగ్గించారు. ఉత్పత్తి తగ్గడానికి ఈ పాలకులే కారణం. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోలేదు. జగన్ కి నష్టాల్లో ఉన్నట్లు తెలియదట. బాబు హామీ ఇచ్చాడట.. కానీ అమలు కాలేదు. విశాఖ భూముల మీద మోడీ కన్ను పడింది. కార్మికులు గత 13 వందల రోజులుగా చేస్తున్న దీక్ష ప్రభుత్వాలకు కనిపించడం లేదు. ఇద్దరు కార్మికులు కూడా చనిపోయారట. కేంద్రంతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కి ఎందుకు సంబంధం ఉండదు? భరోసా ఇవ్వాల్సిన భాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు కి ఉంది.
వైఎస్ఆర్ హయంలో విశాఖ ప్లాంట్ కోసం అనంతపురం లో ఒక మైన్ కూడా ప్లాన్ చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత సొంత మైన్ ఇచ్చే భాధ్యత ను కేంద్రం మరిచింది. వైఎస్ఆర్ మరణం తర్వాత ఎవరికి ప్లాంట్ కష్టాలు పట్టలేదు. విశాఖ సెంటిమెంట్ తో కూడిన ప్లాంట్ అన్నారు. సెంటిమెంట్ అయితే 4 వేల మందిని ఎలా తీసేశారు. 30 ఏళ్ల నుంచి పని చేస్తున్న వాళ్ళు సెంటిమెంట్ కాదా ? విశాఖ స్టీల్ కష్టాలు పట్టని కేంద్రంతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు. బాబు,పవన్ సమాధానం చెప్పాలి.
ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు, పవన్ తక్షణం ఇక్కడకు రండి. కార్మికులకు భరోసా ఇవ్వండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఒకరి మీద ఒకరు నెపం మోపకండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలి. విశాఖ ప్రైవేటీకరణ ఆపాలి. విశాఖ ప్లాంట్ కి నిధులు కేటాయించాలి. సొంత మైన్ ఇవ్వాలి. విధుల నుంచి తొలగించిన 4 వేల మందికి తక్షణం ఉద్యోగాల్లోకి తీసుకోండి. 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి. సెయిల్ లో విలీనం చేయాలి. గ్యారెంటీ ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీకు 48 గంటల సమయం ఇస్తున్నాం. ఈ నెల 4 తేదీన మధ్యానం 1 గంటలోపు కాంట్రాక్టు కార్మికులను తీసుకోక పోతే ఆందోళన ఉదృతం చేస్తాం. 4 వేల మందిని విధులో తీసుకోక పోతే నిరాహార దీక్ష చేస్తాం. ఇదే ప్లాంట్ ఆవరణలో షర్మిలా రెడ్డి దీక్ష చేస్తుంది. అవసరం అయితే రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకు వస్తామని హెచ్చరించారు.
Read More
Next Story