Tirumala || తిరుమలలో హై అలెర్ట్
x

Tirumala || తిరుమలలో హై అలెర్ట్

తిరుమలలో భద్రతా దళాల 'ఏరియా డామినేషన్'


భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొనివున్న నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది.


ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీసు, టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారత్-పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించి తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాతాల్లో తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులను క్షుణ్ణంగా తనికీ చేశారు.


ఇందులో భాగంగా ప్రతిరోజు తిరుమలకు వచ్చే వాహనాలు, మఠాలు, అతిథి గృహాలు, స్థానిక నివాస ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించనున్నారు.


ఈ కార్యక్రమంలో తిరుమల డి ఎస్ పి విజయ్ శేఖర్, ఆక్టోపస్ డిఎస్పి విశ్వనాథం, టీటీడీ ,విజిఓ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.


Read More
Next Story