
కలాంకు సలాం..ప్రముఖుల నివాళులు
ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి నారా లోకేష్ కలాంకు నివాళులు అర్పించారు.
భారత దేశ అణు, శాస్త్రీయ రంగాలకు జీవం పోసిన ప్రముఖ శాస్త్రవేత్త, మానవతా వాది, భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. నిస్వార్థ సేవ, అంకిత భావం, దేశ భక్తిలకు ఆయన జీవితం నిజమైన అర్థాన్ని తెలియజేస్తుందని సీఎం చంద్రబాబు కలాంను కొనియాడితే, క్షిపణి శాస్త్రవేత్త, దార్శనికుడు, నిజమైన దేశ భక్తుడిగా మాజీ సీఎం జగన్ కీర్తించారు. ఆ మేరకు ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు.
శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీయ రంగాలకు మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు, ప్రజల రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత మానవతావాది సేవలను స్మరించుకుందాం. pic.twitter.com/I1CMrOdwhr
— N Chandrababu Naidu (@ncbn) July 26, 2025
Remembering Dr. APJ Abdul Kalam on his death anniversary, an inspiring visionary, exceptional scientist and true patriot. His steadfast commitment to the nation and his timeless words continue to inspire India’s youth to work towards a stronger, developed nation.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 27, 2025
భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారతజాతి గర్వించదగ్గ గొప్ప మేధావి అబ్దుల్ కలాం గారు. ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుగడించారు. శాస్త్రవేత్తగా దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. తనదైన… pic.twitter.com/yX36lkmEQ6
— Lokesh Nara (@naralokesh) July 27, 2025