ఐపీఎస్‌ ఆంజనేయులుకు బీపీ పడిపోయింది
x

ఐపీఎస్‌ ఆంజనేయులుకు బీపీ పడిపోయింది

రిమాండ్‌ ఖైదీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు విజయవాడ జైల్లో ఉన్నారు.


విజయవాడ జైల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు తీవ్ర అస్వస్థత నెలకొంది. ఉన్నట్టుండి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు బీపీ స్థాయిలు పడిపోవడంతో హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.

డీజీ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఇప్పటి వరకు రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కూటమి సర్కార్‌ ఏపీలో కొలువుదీరిన తర్వాత ముంబయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలతో నాడు ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌గా ఉన్న పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఉన్నారనే సమచారంతో అక్కడకు వెళ్లని ఏపీ సీఐడీ అధికారులు ఏప్రిల్‌ 22న ఆయనను అరెస్టు చేసి విజయవాడ జైలుకు తరలించారు. అంతేకాకుండా ఆయన ఇంటితో పాటు ఫామ్‌హౌస్‌లోను, ఆయన బంధువుల ఇళ్లల్లోను సీఐడీ పోలీసులు సోదాలు నిర్వహించారు. తర్వాత మరో కేసు తెరపైకి తెచ్చారు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసును అంజనేయులుపై నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్‌ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు.
Read More
Next Story