పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు 14 రోజులు రిమాండ్‌
x

పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు 14 రోజులు రిమాండ్‌

ముంబాయి సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు.


డీజీపీ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు మే 7 వరకు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్‌ విధించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముంబాయి సినీ నటి కాదందబరి జెత్వానీ కేసును తెరపైకి తెచ్చారు. ఈ కేసులో ఇది వరకే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులైన కాంతిరాణా టాటా, విశాల్‌గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ ముత్యాల సత్యనారాయణలపై కూడా కేసు నమోదు చేశారు. వీరు ప్రస్తుతం సస్పెన్‌లో ఉన్నారు. తాజాగా ఈ కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించిన అనంతరం ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పీసీఆర్‌ ఆంజనేయులును మూడో ఏసీజేఎం కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆంజనేయులుకు మే 7 వరకు రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

మంగళవారం హైదరాబాద్‌లో వియ్యకుండి ఇంట్లో ఉన్న పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు ఆయనకు సంబంధించిన ఫామ్‌హౌస్‌లో సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ ఐపీఎస్‌లు కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీలు ఇది వరకే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి ముందస్తు బెయిల్‌ పోందారు. ఇదే కేసులో ఏ2గా ఉన్న ఆంజనేయులు మాత్రం హైకోర్టును ఆశ్రయించడం కానీ, ముందస్తు బెయిల్‌ తీసుకోవడం కానీ చేయకుండా తనను ఎవరు అరెస్టు చేస్తారనే ధీమాలో ఉన్నారు. గత జగన్‌ ప్రభుత్వంలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు. కాదంబరి జెత్వానీ కేసులో ఈయనే కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. వీరందరిపైన ఐపీసీ 192, 211, 218, 220, 354(డీ), 467, 420, 471 రెడ్‌ విత్‌ 120(బీ), ఐటీ యాక్ట్‌ 66(ఎ), 193,195,166, 166(ఏ), 167, 342 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More
Next Story