
ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సాయం చేయండి
సాస్కి కింద అదనంగా రూ.5,000 కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు.
ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించాలని చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (ఎస్ఏఎస్సీఐ)పథకం కింద రూ. 2,010 కోట్లు లభించాయని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా రూ. 5,000 కోట్లు కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం రూ. 250 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై తగు ఉత్తర్వులు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం పొందగలదని తెలిపారు. దీని విధివిధానాలు రూపొందించి త్వరగా ఈ పథకాన్ని అమల్లో తేవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.