అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం
x

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం

స్మృతి వనంలో 58 అడుగుల శ్రీరాములు కాంస్య విగ్రహం


ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగువారి దారిచూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని, పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.

కూటమి ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా అమరావతిలోని తుళ్లూరు-పెదపరిమి స్మృతివనం ఏర్పాటు చేస్తున్నది. 6.8 ఎకరాలలో ఈ స్మృతి వనం వస్తున్నది. ఇందులో 58 అడుగుల శ్రీరాముం కాంస్య విగ్రహం, ఒక ఆడిటోరియం ఏర్పాటు చేస్తారు.

దీనికి ఈ రోజు రాష్ట్ర ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళలు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. పొట్టి శ్రీరాములు గారిపై రూపొందించిన ఏవీని వీక్షించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగుజాతికి గుర్తింపు సాధించిన వ్యక్తి అని కొనియాడరు. ‘గాంధీ గారు ఎలా ఫాదర్ ఆఫ్ నేషనో పొట్టి శ్రీరాములు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్,’ అని లోకేష్ అన్నారు.

కొన్నిదీపాలు వెలుగునిస్తాయి, కొన్ని దీపాలు దారిచూపిస్తాయి, ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారిచూపించిన దీపం పొట్టి శ్రీరాములు అని అన్నారు.

‘పొట్టి శ్రీరాములు కు 58 అడుగుల విగ్రహం వెనుక చరిత్ర ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దీంతో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటుచేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాలు మనదేశంలో ఏర్పడ్డాయి," అని లోకేష్ అన్నారు.

సమాజంలో మార్పు కోసం అహర్నిశలు పోరాడారు
"ఆయన ఆమరణ నిరాహార దీక్ష వల్ల దేశంలోనే పెను మార్పులువచ్చాయి. ఆయన కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు. సమాజంలో మార్పు కోసం అహర్నిశలు పోరాడారు. మన దళిత సోదరులు ఆలయ ప్రవేశం కోసం పోరాడారు. వివిధ సామాజిక అంశాలపై ఐదు సార్లు నిరాహార దీక్షలు చేశారు. ఆయన ఏకంగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లి గాంధీ తాత దగ్గర నుంచి అహింసను ఆయుధంగా చేసుకున్నారు. గాంధీ తాతనే పొట్టి శ్రీరాములు లాంటివారు పది మంది ఉంటే చాలు.. దేశానికి స్వాతంత్ర్యం ఒక్క ఏడాదిలోనే వచ్చేది,"అని చెప్పారు.
రోశయ్య తాతా గుర్తొస్తున్నారు
పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి కొణిజేటి రోశయ్య గారు నాకు గుర్తుకువస్తారు. రోశయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో ఏడాదికోసారి ఆయనతో మాట్లాడేవాడిని. రాజకీయాల్లో మీరు లేని లోటు తెలుస్తోందని ఆయనతో చెప్పా. మిమ్మల్ని చూసి పెరిగానని, ఏవిధంగా అసెంబ్లీలో పోరాడారో.. రాజశేఖర్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి మధ్య యుద్ధం జరుగుతుందంటే ఒక్కమాటతో దానిని చల్లబరిచేవారు, అది మీ గొప్పతనం, రాజకీయాల్లో ఇప్పుడు లేకుండా పోయిందని చెప్పాను.
పొట్టి శ్రీరాములు గారి చరిత్రపై రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది
రాష్ట్రం కోసం చాలా మంది పనిచేశారు. వారిని మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు స్మృతివనం ద్వారా మనం కేవలం వీడియోస్, ఫోటోస్ మాత్రమే కాకుండా ఒక చైయిర్ కూడా ఏర్పాటుచేసి పొట్టి శ్రీరాములు గారు సమాజానికి ఏవిధంగా పనిచేశారో, దానిపై రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి వేదికపై ఉన్న పెద్దల సహకారం కోరుతున్నా. ఇప్పుడు ప్రదర్శించిన వీడియోలో పెద్దగా ఫోటోలు లేవు. ఆయన ఫోటోలన్నీ సేకరించాలి. లైబ్రరీ నుంచి బుక్స్ తీసుకువచ్చి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్మృతివనం నిర్మించడమే కాదు.. ఒక చైయిర్ ఏర్పాటుచేసి ఆయన చరిత్రపై రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ.. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రతిష్టించాలని, ఆడిటోరియం నిర్మించాలని చంద్రబాబు గారిని, మంత్రి నారా లోకేష్ ను కోరిన వెంటనే అంగీకరించారు. ఆ బాధ్యతను మంత్రి నారాయణ గారు మీద వేసుకుని సీఆర్డీయే అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించారు. వాసవీ కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరితే చంద్రబాబు గారిని ఒప్పించి, పెనుగొండ పంపించి పట్టువస్త్రాలు సమర్పించిన ఘనత ఎన్డీయే కూటమిది. పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం కోసం అమరావతి నడిబొడ్డున 6.8 ఎకరాల స్థలం కేటాయించారు. రాబోయే మార్చి 16న 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ గారితో ఆవిష్కరింపజేస్తామని మాట ఇస్తున్నా.
మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ టీజీవీ గ్రూప్ తరపున మొదటి విరాళం రూ.కోటి అందిస్తున్నట్లు ప్రకటించారు
"ఇతర ఏ సహకారం కావాలన్నా అందిస్తాం. గత ఎన్నికల్లో 95 శాతం మంది ఆర్యవైశ్యులు కూటమికి ఓటేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా నాకు కూడా మంచి శాఖ కేటాయించి గుర్తింపు ఇచ్చారు," అని భరత్ అన్నారు.


Read More
Next Story