వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో రాజకీయ చిచ్చు
x
CM Chandrababu

వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో రాజకీయ చిచ్చు

పరిపాలనా సవాళ్లు, రాజకీయ కుట్రలు, సామాజిక సమతుల్యతల నడుమ అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల పునర్విభజన జరిగింది.


ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా విభజనల ప్రక్రియ రాజకీయ ఆటలకు ఆకర్షణీయమైన మైదానంగా మారిపోతుంది. 2022లో వైఎస్ఆర్ కడప జిల్లాను రెండుగా విభజించి అన్నమయ్య (రాయచోటి కేంద్రం) ఏర్పాటుకు దారితీసిన తర్వాత, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రివిజన్‌లో మరోసారి మార్పులు తీసుకొచ్చింది. పూర్వ కడప జిల్లా మరోసారి ఏకీకృతమై 40 మండలాలతో రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా అవతరించగా, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గానికి మారింది. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం కూడా కడపకు మార్చడంతో ఈ మార్పులు పరిపాలనా సౌకర్యాలు మెరుగుపరచడం కాకుండా, టీడీపీలోని అంతర్గత పోరులు, కుల రాజకీయాలు, సామాజిక సమతుల్యతలను ప్రభావితం చేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పరిపాలనా కోణం

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రస్తుతం 40 మండలాలతో రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో మండలాలు కలిగిన జిల్లాగా నిలిచింది. ఈ విస్తరణకు కారణం 2022 విభజన తర్వాత అన్నమయ్య నుంచి విడిపోయిన మండలాలు, రాజంపేట ప్రాంతాన్ని తిరిగి చేర్చడం. జిల్లాలో ప్రస్తుతం ఐదు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కడప, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, ప్రొద్దటూరు. ఈ డివిజన్లు మొత్తం 40 మండలాలను కవర్ చేస్తున్నాయి. ఇది పరిపాలనా భారాన్ని పెంచుతోంది. ఇందులో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కడప, పులివెందుల, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దటూరు, రాజంపేట, కమలాపురం. ఈ విస్తరణ కడపను భౌగోళికంగా, పరిపాలనాత్మకంగా అతిపెద్ద జిల్లాగా మార్చినప్పటికీ, రెవెన్యూ అధికారులు "ఒకే జిల్లా కింద ఇంత పెద్ద స్కేల్ మేనేజ్‌మెంట్ సవాలుగా మారింది" అంటున్నారు.

అన్నమయ్య జిల్లా మార్పు...

అన్నమయ్య జిల్లా మార్పు మరింత సంక్లిష్టతను తీసుకొచ్చింది. మదనపల్లి, ఇప్పుడు అన్నమయ్య కేంద్రంగా మారినప్పటికీ, ఇది పీలేరు, చిత్తూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంది. పీలేరు పరిధిలో సదుం, సోమల మండలాలు, చిత్తూరు పరిధిలో పులిచర్ల, రొంపిచర్ల మండలాలు ఉండటంతో అన్నమయ్య కలెక్టర్‌కు ముగ్గురు ఆర్‌డీవోలతో (చిత్తూరు, పీలేరు, మదనపల్లి) సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. ఇది రెవెన్యూ వ్యవస్థలో ఇరుక్కోవటానికి, డేటా షేరింగ్‌లో ఆలస్యాలకు దారితీస్తోంది. రెవెన్యూ శాఖ అధికారులు "ఒక రెవెన్యూ డివిజన్ రెండు జిల్లాల మధ్య విభజించబడటం పరిపాలనా ఇబ్బందులను పెంచుతుంది" అని అంటున్నారు. ఈ మార్పు పాలనా సౌకర్యాలు మెరుగుపరచటానికేనని చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ, భూమి రికార్డులు, రోజువారీ పరిపాలనలో గందరగోళం ఏర్పడటానికి దారితీస్తోంది.

రాజకీయ కోణం: అంతర్గత పోరులు, హామీల ఆటలు

ఈ మార్పులు పరిపాలనా పరమైన అంశాలకు సంబంధించినవి కాకుండా, టీడీపీలోని అంతర్గత కుమ్ములాటలకు ద్వారా నడిచాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా కేంద్రానికి చెందినవారిగా ఈ మార్పుకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డారు. గత నెలలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాయచోటి కేంద్రాన్ని మదనపల్లికి మార్చాలనే ప్రతిపాదనపై రాంప్రసాద్ రెడ్డి ఏడ్చి, సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇది టీడీపీలోని రెడ్డి గ్రూప్‌ల మధ్య పోరాటానికి సూచిక. పాలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్ నాథ్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి లు మంత్రి పదవుల కోసం పోటీపడ్డారు. అయితే రాంప్రసాద్‌కు పదవి దక్కడంతో వారి అసంతృప్తి పెరిగింది. "పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది" అనే సామెతలా రాంప్రసాద్ పదవి పొందటానికి వారే కారకులయ్యారు. అయితే రాంప్రసాద్ రెడ్డి ఇటీవల కాలంలో ఈ ఎమ్మెల్యేలకు కావాల్సిన పనులు చేయించడం లేదని వారు రాయచోటి నుంచి మదనపల్లికి అన్నమయ్యను మార్చేందుకు మద్దతు ఇచ్చారు.

ఎన్నికల హామీకి భిన్నంగా...

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగిస్తూనే మదనపల్లి, రాజంపేటలను కొత్త జిల్లాలుగా చేయాల్సి ఉంది. ఈ అంశాన్ని కిశోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు తెరపైకి తీసుకొచ్చి ఇచ్చిన హామీని అమలు చేయాలని పట్టుపట్టారని, దీనిని తప్పించుకోలేక సీఎం మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే రాయచోటిని రద్దుచేసి మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం వల్ల రాంప్రసాద్ రెడ్డికి చెక్ పెట్టారే కాని ఒకింత తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగిందనే చర్చ కూడా ఉంది. గతంలోనూ వైఎస్సార్సీపీకి రాయచోటి బలమైన కేంద్రంగానే ఉంది. తిరిగి వైఎస్ జగన్ వస్తే రాయచోటి మరో జిల్లా అవుతుందని వైఎస్సార్ సీపీ వారు ప్రచారం మొదలు పెట్టారు. మదనపల్లి జిల్లా కావడం అనేది తెలుగుదేశం పార్టీ అంతర్గత పోరులో భాగమేనని, కొత్త జిల్లా ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ చంద్రబాబు అమలు చేసే అవకాశం లేకపోవడంతో రాయచోటి ని మార్చి మదనపల్లెను తీసుకొచ్చారనే చర్చ కూడా జోరందుకుంది. ఈ మార్పులు రాజకీయంగా జరిగాయనేది ప్రతి ఒక్కరినోటా వస్తున్న మాట. నిజం ఏమిటనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే తెలుసు. అయినా నిప్పులేనిదే పొగరాదంటారు. తెలుగుదేశం లోని అంతర్గత పోరే మదనపల్లి జిల్లా కేంద్రం అయింది తప్ప పాలనా సౌకర్యం కోసం కాదనేది కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.

అన్నమయ్య డీఆర్సీ సమావేశంలో కిశోర్ కుమార్ రెడ్డి తండ్రి అమర్ నాథ్‌ రెడ్డి పేరును మంత్రి రాంప్రసాద్ ప్రస్తావించడం, దానికి ప్రతీకారంగా ఈ మార్పు జరిగిందనే చర్చ కూడా జరుగుతోంది. తన తండ్రిని అవమానించే విధంగా మాట్లాడే అంతటి వాడయ్యాడా? అంటూ కిశోర్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఈ అంతర్గత పోరు టీడీపీకి దీర్ఘకాలికంగా నష్టం కలిగించవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే "రాయచోటి మరోసారి జిల్లా అవుతుంది" అని ప్రచారం చేస్తోంది.

సామాజిక కోణం: రెడ్డి ఆధిపత్యం vs బలిజ ఐక్యత

రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కడపకు మార్చడం వెనుక కుల రాజకీయాలు ముఖ్యమైనవి. రాజంపేటలో బలిజ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండటంతో, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంటి రెడ్డి నాయకులు ఇక్కడ బలంగా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని కడపలోకి చేర్చడం వల్ల కడపలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యాన్ని మరింత తగ్గించడం, బలిజల ఐక్యతను పెంచడం ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహం రచించారని టీడీపీలో చర్చ జరుగుతోంది. మదనపల్లి మార్పు కూడా ఇలాంటి సామాజిక సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే రాయచోటి ప్రాంతం వైఎస్సార్ సీపీకి బలమైన స్థానం. ఈ మార్పులు కులాల మధ్య టెన్షన్‌లను పెంచవచ్చు. ముఖ్యంగా ఎక్కువ రెడ్డి ప్రభావం కలిగిన కడపలో బలిజలు మైనారిటీగా మారే అవకాశం ఉంది.

హామీలు vs హక్కులు, ప్రజల ప్రయోజనం ఎక్కడ?

ఈ జిల్లా మార్పులు పరిపాలనా సవాళ్లను పెంచినప్పటికీ, రాజకీయ అంతర్గతాలు, కుల గేమ్‌లకు బలమైన ఆధారాలుగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలను అమలు చేసినట్టు కనిపించినా, రాయచోటి నివాసులు ఆర్థికంగా నష్టపోయారు. గుర్తింపును కోల్పోయారు. "నిప్పులేనిదే పొగ రాదు" అనే సామెతలా ఈ మార్పుల వెనుక టీడీపీ అంతర్గత పోరు మాత్రమే కాదు, దీర్ఘకాలిక రాజకీయ ఆటలు కూడా దాగి ఉన్నాయని విశ్లేషకులు అంచనా. ప్రజల సౌకర్యాలు రక్షించబడాలంటే ఈ మార్పులు రాజకీయంగా కాకుండా, పరిపాలనా సౌలభ్యాలపై ఆధారపడాలి. లేకపోతే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి చర్చలు తలెత్తవచ్చు.

అతి పెద్ద జిల్లాగా వైఎస్సార్ కడప

వైఎస్ఆర్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద జిల్లాలలో ఒకటిగా 2026లో ఏర్పడింది. మొత్తం 40 మండలాలతో ఏర్పాటు కావడం విశేషం. ఈ విస్తరణ 2022 జిల్లా విభజనల తర్వాతి రివిజన్‌ల ఫలితంగా జరిగింది.

రెవెన్యూ డివిజన్లు (Revenue Divisions)

జిల్లాలో మొత్తం 5 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల, రాజంపేట. ఇవి మండలాలను పరిపాలనాత్మకంగా విభజించి నిర్వహిస్తాయి.

మండలాలు (Mandals)

జిల్లాలో 40 మండలాలు ఉన్నాయి. ఇవి రెవెన్యూ డివిజన్ల ప్రకారం విభజించబడ్డాయి. కింది పట్టికలో పూర్తి జాబితా ఉంది.

రెవెన్యూ డివిజన్

మండలాలు (సంఖ్య)

కడప (Kadapa)

సి.కె. డిన్నె (C.K. Dinne), చెన్నూర్ (Chennur), కమలాపురం (Kamalapuram), పెండ్లిమర్రి (Pendlimarri), వల్లూరు (Vallur), ఎర్రగుంట్ల (Yerraguntla), కడప (Kadapa), వొంటిమిట్ట (Vontimitta), సిద్దౌత్ (Sidhout)

జమ్మలమడుగు

(Jammalamadugu)

జమ్మలమడుగు (Jammalamadugu), కొండాపురం (Kondapuram), ముద్దనూరు (Muddanur), మైలవరం (Mylavaram), రాజుపాలెం (Rajupalem), ప్రొద్దుటూరు (Proddatur), పెద్దమండ్యం (Peddamudium)

బద్వేలు (Badvel)

చాపాడు (Chapad), ఖాజిపేట్ (Khajipet), దువ్వూరు (Duvvur), మైదుకూరు (Mydukur), అట్లూరు (Atloor), బి.కోడూరు (B.Kodur), బి. మట్టం (B. Mattam), బద్వేలు (Badvel), గోపవరం (Gopavaram), కలసపాడు (Kalasapadu), పోరుమామిళ్ల (Porumamilla), శ్రీ అవధూత కాశీనాయన (Sri Avadhutha Kasinayana)

పులివెందుల (Pulivendula)

చక్రాయపేట (Chakrayapet), లింగాల (Lingala), పులివెందుల (Pulivendula), సింహాద్రిపురం (Simhadripuram), థొందూరు (Thondur), వేంపల్లి (Vempalli), వేముల (Vemula), వి.ఎన్. పల్లి (V.N. Palli)

రాజంపేట (Rajampet)

నందలూరు (Nandalur), రాజంపేట (Rajampet), వీరబల్లి (Veeraballi), టి. సుందుపల్లె (T. Sundupalle)

అసెంబ్లీ నియోజకవర్గాలు (Assembly Constituencies)

జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవి కింది విధంగా ఉన్నాయి (సంఖ్యలు, ప్రస్తుత ఎమ్మెల్యేల పేర్లు)

సంఖ్య

నియోజకవర్గం పేరు

ప్రస్తుత ఎమ్మెల్యే

124

బద్వేలు (SC) (Badvel)

డా. దాసరి సుధ

125

రాజంపేట (Rajampet)

ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి

126

కడప (Kadapa)

మాధవీ రెడ్డప్పగారి

129

పులివెందుల (Pulivendula)

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి

130

కమలాపురం (Kamalapuram)

కృష్ణ చైతన్య రెడ్డి పుట్ట

131

జమ్మలమడుగు (Jammalamadugu)

అదినరాయణ రెడ్డి చడిపిరాల

132

ప్రొద్దుటూరు (Proddatur)

నంద్యాల వరదరాజుల రెడ్డి

133

మైదుకూరు (Mydukur)

పుట్ట సుధాకర్ యాదవ్


Read More
Next Story