మనకేం కావాలి?రాజకీయ లబ్దా? సమస్యల పరిష్కారమా? ప్రకాష్‌రాజ్ ట్వీట్‌
x

మనకేం కావాలి?రాజకీయ లబ్దా? సమస్యల పరిష్కారమా? ప్రకాష్‌రాజ్ ట్వీట్‌

ట్విట్టర్‌ లో ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ ప్రకాష్‌రాజ్‌ వరుస పోస్టులు. తాజాగా మరో బాణం. విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గని ప్రకాష్‌రాజ్‌.


ప్రకాష్‌రాజ్‌ విలక్షణ నటుడు. బహు భాషాకోవిదుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు, కన్నడతో పాటు పలు ల్యాంగ్వేజెస్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. నటనలోనే కాదు సమాజాన్ని తన కోణం నుంచి అధ్యాయనం చేసిన వ్యక్తి. బలమైన లౌకిక వాది. సర్వ మతాలు సమానమని చాటి చెప్పే వ్యక్తి. అనేక భాషల్లో ఆయన నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందూ మతం పేరుతో విద్వేషాలను ఆయన ఖండిస్తారు. దేశ సౌభాగ్యానికి, ఐక్యతకు విఘాతం కలిగిస్తాయని నమ్ముతారు. పరమత సహనం ఖచ్చితంగా ఉండాలంటారు. ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే సెక్యులరిజమ్‌ బలంగా ఉన్నప్పుడే సాధ్యమని చెబుతుంటారు. వాటిపైన గొంతెత్తి మాట్లాడుతారు. అది నేరుగా అయినా.. సామాజిక వేదికల ద్వారా అయినా.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంతో చోటు చేసుకున్న మత విద్వేషాలపై తనదైన శైలిలో ఆయన స్పందిస్తూనే ఉన్నారు. విదేశాల్లో షూటింగ్‌ల్లో ఉన్నానని, వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతీ మాటకు సమాధానం చెబుతనాని ఇప్పటికే సామిజిక వేదిక ద్వారా చెప్పారు.
తాజాగా ఏపీలో జరుగుతున్న మత రాజకీయాల పట్ల ఆయన మరో సారి స్పందించారు. సామాజిక మాధ్యమమైన ఎక్స్‌ వేదికగా మరో పోస్టు చేశారు. ‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్‌ ఆస్కింగ్‌’’ అని తన ట్వీట్‌ లో పేర్కొన్నారు.
ఇప్పటికే ఆయన పోస్టులు వైరల్‌గా మారాయి. అధికారంలో ఉండి, విచారణ చేపట్టి దోషులను శిక్షించకుండా ప్రజలలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం మంచిది కాదని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి పోస్టు పెట్టారు. దీనిపైన స్పందించిన పవన్‌ కళ్యాణ్‌ ప్రకాష్‌రాజ్‌పై తీవ్ర స్వరంతోనే హెచ్చరించారు. తన పోస్టులను సరిగా అర్థం చేసుకోలేదని, ఒక సారి చదివి అర్థం చేసుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ను కోరారు. ఇదే సమయంలో ప్రకాష్‌రాజ్‌పై జనసేన నేతలే కాకుండా హిందూ సంఘాల నాయకుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా వెనక్కి తగ్గని ప్రకాష్‌ రాజ్‌ వరుస ట్వీట్లతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గురువారం చేసిన ట్వీట్‌ కూడా వైరల్‌గా మారింది. ‘చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేమిటో జస్ట్‌ ఆస్కింగ్‌ అని పోస్టు చేశారు. గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత మరో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనీ అయోమయం.. ఏది నిజం.. జస్ట్‌ ఆస్కింగ్‌ని పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. బెదిరింపులకు, విమర్శలకు తలొగ్గకుండా తన అభిప్రాయాన్ని ఎక్స్‌ వేదికగా ప్రకాష్‌రాజ్‌ పోస్టు చేయడం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగానే మారింది.
Read More
Next Story