లోకేష్‌ను మెచ్చుకున్న పవన్‌ కల్యాణ్‌
x

లోకేష్‌ను మెచ్చుకున్న పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంత్రి నారా లోకేష్‌ను ప్రశంసించారు.


అమరావతి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంత్రి నారా లోకేష్‌ను తన గుండెలకు హత్తుకున్నారు. శభాష్‌ లోకేష్‌ అంటూ పవన్‌ కల్యాణ్‌ మెచ్చుకున్నారు. కేబినెట్‌ సమావేశానికి హాజరయ్యేందుకు బుధవారం సచివాలయానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు లోకేష్‌ తన యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందజేశారు. లోకేష్‌ తన యువగళం పాదయాత్రలో తాను చూసిన సమస్యలను, తన అనుభవాలను పవన్‌ కల్యాణ్‌కు వివరించారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ పుస్తకాన్ని పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు. పాదయాత్రలో తన అభనుభవాలను ఆకట్టుకునే విధంగా లోకేష్‌ ఈ పుస్తకంలో పొందుపరిచిన ఆ దృశ్యాలను చూసిన పవన్‌ కల్యాణ్‌ తెగ ముచ్చట పడ్డారు. ఈ సందర్భంగా లోకేష్‌ను అభినందించారు. గత ఐదేళ్ల రాక్షస పాలన మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను చైతన్యం చేయడంలో యువగళం పాదయాత్ర ద్వారా చేసిన కృషి సఫలీకృతమైందని లోకేష్‌ను ప్రశంసించారు. ఆ మేరకు జనసేన పార్టీ సోషల్‌ మీడియా వేదికగా కూడా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఎక్స్‌ వేదికగా జనసేన పార్టీ పోస్టు పెట్టింది.

ఇదే పుస్తకాన్ని ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సంతకం చేసిన కాపీని మంత్రి లోకేష్‌కు అందజేశారు. తర్వాత ఇటీవల కడపలో జరిగిన టీడీపీ మహానాడు సమావేశాల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మరో సారి ఆవిష్కరించారు. యువగళం పుస్తకం చూసిన చంద్రబాబు మహానాడు వేదిక మీద లోకేష్‌ను అభినందించారు.

Read More
Next Story