
లోకేష్ను మెచ్చుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంత్రి నారా లోకేష్ను ప్రశంసించారు.
అమరావతి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రి నారా లోకేష్ను తన గుండెలకు హత్తుకున్నారు. శభాష్ లోకేష్ అంటూ పవన్ కల్యాణ్ మెచ్చుకున్నారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు బుధవారం సచివాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్కు లోకేష్ తన యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందజేశారు. లోకేష్ తన యువగళం పాదయాత్రలో తాను చూసిన సమస్యలను, తన అనుభవాలను పవన్ కల్యాణ్కు వివరించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఈ పుస్తకాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. పాదయాత్రలో తన అభనుభవాలను ఆకట్టుకునే విధంగా లోకేష్ ఈ పుస్తకంలో పొందుపరిచిన ఆ దృశ్యాలను చూసిన పవన్ కల్యాణ్ తెగ ముచ్చట పడ్డారు. ఈ సందర్భంగా లోకేష్ను అభినందించారు. గత ఐదేళ్ల రాక్షస పాలన మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలను చైతన్యం చేయడంలో యువగళం పాదయాత్ర ద్వారా చేసిన కృషి సఫలీకృతమైందని లోకేష్ను ప్రశంసించారు. ఆ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా కూడా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఎక్స్ వేదికగా జనసేన పార్టీ పోస్టు పెట్టింది.
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చేసిన యువ గళం పాదయాత్రపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని శ్రీ @naralokesh గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ లోకేష్… pic.twitter.com/ZBDJWVS81S
— JanaSena Party (@JanaSenaParty) June 4, 2025