
పవన్ కల్యాణ్కు కర్ణాటకలో ఘన స్వాగతం
జస్టిస్ గోపాలగౌడ అమృత మహాత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ్ 80వ జన్మదినోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు ఘన స్వాగతం లభించింది. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణి పట్టణంలో ఈ రోజు (అక్టోబర్ 6, 2025) జస్టిస్ వి. గోపాల గౌడ్ అమృత మహోత్సవం పేరుతో తన 80వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. జస్టిస్ గోపాల గౌడ్ , కోలార్ ఎమ్మెల్యే ఎం. మల్లేశ్ బాబు, కర్ణాటక శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. కృష్ణారెడ్డి, అనితా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఎస్. యుధిష్ఠర్, లయోన్స్ క్లబ్ ఆఫ్ మార్గ్ అధ్యక్షుడు ఎన్. నవీన్ జి. కృష్ణ తదితరులు పవన్ కల్యాణ్కు బెంగుళూరు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు.