రాములోరి కళ్యాణానికి తలంబ్రాలు తయారీ ప్రారంభం
x

రాములోరి కళ్యాణానికి తలంబ్రాలు తయారీ ప్రారంభం


శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 22న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో బుధ‌వారం తలంబ్రాల ప్యాకింగ్‌ను జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ప‌రిశీలించారు.


DINESH GUNAKALA




ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ, శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22న జరగనున్న

శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న ముత్యాల‌ త‌లంబ్రాల ప్యాకింగ్ కార్య‌క్ర‌మం శ్రీవారి సేవకులతో ప్రారంభించిన‌ట్లు తెలిపారు.

ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చార‌న్నారు.

శ్రీ సీతా రామ కళ్యాణం కోసం తలంబ్రాల తయారీకి అవసరమయ్యే పసుపు వినియోగించేందుకు ఏప్రిల్ 13న‌ పుసుపు దంచే కార్యక్రమం నిర్వ‌హించామ‌న్నారు.

ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్న‌ట్లు చెప్పారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు.




క‌డ‌ప‌, అన్న‌మ‌య్య జిల్లాలతో పాటు క‌ర్నూలు, రాజ‌మండ్రి నుండే కాకుండా

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందించేందుకు శ్రీ‌వారి సేవ‌కులు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 1.20 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.



Read More
Next Story