
Nara Lokesh
ఓరి నీ పాసుగోల... ఏందయ్యా జగన్!
జగన్ ను కలిసేందుకు కార్యకర్తలకు పాస్ ల జారీపై టీడీపీ నేత లోకేష్ సెటైర్లు
మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలకు పాసులు జారీ చేయడంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘ఓరి నీ పాసుగోల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..!’’ అంటూ జగన్ తీరును ఎండగట్టారు.
ఇటీవల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను కలవడానికి వీఐపీ పాసులు జారీ చేయించారు. ఈ పరిణామం పలువురిని విస్మయానికి గురిచేసింది. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ సోమవారం పులివెందుల వచ్చారు. కొందరు కార్యకర్తలను మాత్రమే మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలుసుకున్నారు. పాసులున్న వ్యక్తులనే భద్రతా సిబ్బంది అనుమతించడం, గతంలో ఎన్నడూలేని విధంగా కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కంగుతిన్నారు. భద్రతా సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు.
Next Story