
కొమ్మినేని పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు
రాష్ట్రం నుంచి నివేదిక కోరిన కమిషన్
అమరావతి మహిళల కేసును జాతీయ మహిళ కమిషన్ సుమోటాగా తీసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసింది. ఏపీ రాష్ట్ర డీజీపీకి కమిషన్ చైర్ పర్సన్ విజయ హత్కర్ లేఖ రాస్తూ ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇటీవల సాక్షి టీవీలో అమరావతి ఏరియాలోని మహిళలు ఎక్కువ మంది వేశ్యలంటూ చర్చలో పాల్గొన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడారు.
దీనిపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా జాతీయ మహిళ కమిషన్ కేసు నమోదు చేసింది. ఈ విషయంలో మహిళలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. నాలుగు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.