వైసిపి ఆపేసిన చోటు నుంచే సైకిల్ యాత్ర...
x

వైసిపి ఆపేసిన చోటు నుంచే సైకిల్ యాత్ర...

మహానాడుకు చేరుకున్న ఉత్తరాంధ్ర టిడిపి సైకిల్ యాత్రికులకు లోకేష్ అభినందన


కడప:మొత్తానికి ఎచ్చర్ల నియోజకవర్గానికి చెందిన టిడిపి కార్యకర్తలు సైకిల్ యాత్ర పూర్తి చేశారు.. గతంలో వైసిపి నేతలు అవమానించి, ఆపేసిన చోటు నుంచి సైకిల్ పై జైత్రయాత్ర పునరుద్ధరించి మహానాడుకు చేరుకున్న ఆరుగురు ఉత్తరాంధ్ర పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అభినందించారు.

అసలేమి జరిగిందంటే...

వైసిపి పార్టీ అధికారంలో ఉన్నపుడు జరిగిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు సంఘీభావంగా 2023 అక్టోబర్ 2న ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన నిద్రవెంగి రామకృష్ణ, చిల్లా రామసూరి, నిద్రవెంగి ఆదినారాయణ, బోయ పెంటారెడ్డి, ఎన్. సుందర్ రావు, సరగడ రమేష్ అనే కార్యకర్తలు ఎచ్చెర్ల నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. సైకిల్ యాత్ర పుంగనూరు నియోజకవర్గం సుదాలమెట్టకు చేరుకున్న సమయంలో 2023 అక్టోబర్ 20న వైసిపికి చెందిన చెంగలాపు సూరి, మరికొందరు అతడి అనుచరులు టిడిపి కార్యకర్తలను చొక్కాలు విప్పించి తీవ్రంగా అవమానించి అడ్డుకున్నారు. దానితో వాళ్లు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇది సంచలనమై సోషల్ మీడియాలో వైరల్ అయింది.

యాత్ర పునరుద్ధరణ

అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడైతే యాత్ర నిలిపివేశారో అక్కడి నుంచి ఆ ఆరుగురు టిడిపి కార్యకర్తలు సోమవారం సైకిల్ పై జైత్రయాత్ర ప్రారంభించి కడప మహానాడుకు చేరుకున్నారు. విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు నేతృత్వంలో ఆ కార్యకర్తలు మంగళవారం సాయంత్రం కడప మహానాడు ప్రాంగణంలో యువనేత నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ వారిని అభినందిస్తూ... అరాచకపాలనపై మీవంటి వారు ధైర్యంగా గళమెత్తడం వల్లే గత ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్దిచెప్పారని అన్నారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని యువనేత లోకేష్ భరోసా ఇచ్చారు. లోకేషన్న ఇచ్చిన భరోసా తమకు కొండంత ధైర్యాన్నిచ్చిందని, భవిష్యత్తులో పార్టీకోసం మరింత ఉత్సాహంతో పనిచేస్తామని సైకిల్ యాత్రీకులు సంతోషం వ్యక్తంచేశారు.



Read More
Next Story