
విశాఖ జిల్లా యంత్రాంగానికి ‘నారా లోకేష్’ స్పెషల్ సెల్యూట్
అద్భుతమైన విజయం వెనుక మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారని లోకేష్ అన్నారు.
విశాఖపట్నంలో 2025 జూన్ 21వ తేదీన, 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవం చరిత్రాత్మకంగా జరిగింది. ఈ ఉత్సవం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించడంతో పాటు, రాష్ట్రం గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించింది. ఈ విజయం వెనుక ఉన్న కృషి, నాయకత్వం, పాల్గొన్న వారి రోల్ను వివరిస్తుందని ఏపీ మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ట్విటర్ వేదికగా స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వం కీలకం. యోగ ప్రాక్టీషనర్లు, విద్యార్థులు, స్వయం సేవకులు, అధికారులు అందరి కృషి విజయానికి కారణం అని అన్నారు.
విశాఖ జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖలు, AYUSH, ఆరోగ్య శాఖలు, పాఠశాల, ఉన్నత విద్యా శాఖలు, GVMC, పర్యాటక అధికారులు, అందరి స్టాఫ్ ఎంతో గొప్పగా పనిచేశారని, వారికి స్పెషల్ సెల్యూట్ చేస్తున్నానన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని చరిత్రాత్మకంగా జరుపుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రేరణాత్మక నాయకత్వం, మద్దతుతో Yogandhra విజయవంతం అయిందన్నారు.
ఎంతో మంది యోగ ప్రాక్టీషనర్లు, విద్యార్థులు, స్వయంసేవకులు, నిర్దేశకులు, ప్రజలు ఉత్సాహభరితంగా పాల్గొనడం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించడానికి సహాయపడింది.
#APBreaksWorldRecord#InternationalYogaDay #YogandhraWorldRecord
— Lokesh Nara (@naralokesh) June 21, 2025
Heartfelt thanks to the people of Andhra Pradesh, especially Visakhapatnam, for making the 11th International Yoga Day a historic celebration.
Gratitude to Hon’ble PM Shri @narendramodi ji, Hon’ble CM @ncbn… pic.twitter.com/ytJarzEpl0
ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆరోగ్య మార్గదర్శకాలను చూపించింది. Yogandhra కోసం గర్వించగల, మర్చిపోలేని క్షణం! అని ట్విటర్ లో పేర్కొన్నారు.