
కుంకీ ఏనుగులు..పవన్ కళ్యాణ్లపై లోకేష్ ఏమన్నారంటే
ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతుల పంటపొలాలను అడవి ఏనుగుల నుంచి కాపాడేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకొచ్చారు.
కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కు కుంకీ ఏనుగులను తీసుకొచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మంత్రి నారా లోకేష్ ఓ రేంజ్లో పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ అన్నా అంటూ మరో సారి పవన్ కళ్యాణ్పై నారా లోకేష్ తన అభిమానాన్ని చాటుకున్నారు. కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్కు కుంకీ ఏనుగులను తీసుకొచ్చిన పవన్ అన్నకు అభినందనల తెలిపిన లోకేష్ ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు అవసరమైతే మరిన్ని కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు ఒప్పుకున్న కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఉమ్మడి చిత్తూరుజిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను… pic.twitter.com/bLVmxQPfdM
— Lokesh Nara (@naralokesh) May 22, 2025