
చంద్రబాబుకు నాగార్జున ఆహ్వానం
ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును నాగార్జున కలిశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కలిశారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో మంగళవారం నాగార్జున ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు నాగార్జున ఆహ్వానం పత్రికను అందజేశారు. తన కుమారుడు అక్కినేని అఖిల్ వివాహానికి హాజరు కావాలని చంద్రబాబును, నాగార్జున ఆహ్వానించారు.
అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ వివాహం ఈ నెల 6న జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులను నాగార్జున స్వయంగా కలుస్తూ పెళ్లి పత్రికలను పంచుతూ తన కుమారుడు అఖిల్ పెళ్లికి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను అఖిల్ పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు తమ కుటుంబ విషయాలతో పాటు సినిమాల విషయాలు కూడా చర్చించుకున్నట్లు సమాచారం.
Next Story