
‘మొహర్రం’ చారిత్రాత్మక పోరాటానికి గుర్తు
ముస్లిం సోదరులకు సందేశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.
తెలుగుదేశం పార్టీ పెద్దలు, కూటమి రథసారథులు, తండ్రీ కొడుకులైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు మొహర్రం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ముస్లిం సోదరులకు సందేశాలు ఇచ్చారు.
మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహర్రం అని సీఎం చంద్రబాబు అన్నారు. మహమ్మద్ ప్రవక్త మనమడు ఇమామ్ హుస్సేన్ను శత్రువులు బలిగొన్న రోజు ఈ రోజు అని పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం సందేశం ఇచ్చారు. మొహర్రం రోజున ఇస్లామ్ నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందన్నారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులు సంప్రదాయాలకు అనుగుణంగా మొహర్రం జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ముస్లిం సోదరలకు సందేశం ఇచ్చారు.
త్యాగం, భక్తి, విశ్వాసం ప్రకటించడమే మొహర్రం అని సీఎం చంద్రబాబు కొడుకు మంత్రి నారా లోకేష్ కూడా ముస్లిం సోదరులకు సందేశం ఇచ్చారు. ఇస్లామిక్ క్యాలెండర్లోని మొదటి నెలైన మొహర్రం ముస్లింలకు పవిత్రమైనది, ప్రవక్త మహమ్మద్ మనుమడు ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని గౌరవించే సంతాప కాలంలో త్యాగం, భక్తి, విశ్వాసం ప్రకటించడమే మొహర్రం అని మంత్రి నారా లోకేష్ ముస్లీం సోదరులకు మొహర్రం సందర్భంగా సందేశం ఇచ్చారు.
Next Story