సిట్ విచారణకు మోహిత్ రెడ్డి డుమ్మా
x

సిట్ విచారణకు మోహిత్ రెడ్డి డుమ్మా

విచారణకు హాజరయ్యేందుకు మూడు రోజుల సమయం ఇవ్వాలని కోరిన చెవిరెడ్డి కుమారుడు


ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ ముందు విచారణకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు, వైసీపీ నేత మోహిత్ రెడ్డి గైర్హాజరయ్యారు.రెండు రోజుల క్రితం మోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు బుధవారం తమ విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.అయితే ఈరోజు సిట్ ముందు విచారణకు మోహిత్ రెడ్డి హాజరు కాలేదు.విచారణకు హాజరు కావటానికి మూడు రోజుల సమయం కావాలని కోరారు.ఈ కేసులో ఆయన ఏ-39గా ఉన్నారు.మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే ఏసీబీ కోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు.ఆ పిటీషన్ న్యాయస్థానంలో వుండటం వల్లే ఆ తీర్పు కోసమే మోహిత్ రెడ్డి ఈరోజు సిట్ ముందు హాజరుకానట్లు తెలుస్తోంది.

మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి వారిని విచారిస్తున్నారు. ఇటీవలనే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు.అతని బినామీగా చెబుతున్న వెంకటేశ్ నాయుడును సిట్ అధికారులు అరెస్ట్ చేసారు.
Read More
Next Story