బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ షాక్ ,పార్టీకి రాజీనామా
x

బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ షాక్ ,పార్టీకి రాజీనామా

తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు చిచ్చు రేపాయి. రాజాసింగ్ పార్టీని వీడారు.


తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నిస్తూ వస్తున్న రాజాసింగ్ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి ఎన్నిక విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన రాజాసింగ్ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు వెల్లడించారు.మీ పార్టీకో దండం , ఎమ్మెల్యే పదవికో దండం అంటూ కిషన్ రెడ్డికి లేఖ పంపిన రాజాసింగ్ ,ఎమ్మెల్యే పదవికి తన రాజీనామా లేఖను కూడా పంపుతున్నానని , దానిని కిషన్ రెడ్డే స్పీకర్ కు పంపుకోవచ్చన్నారు.బీజేపీ గుర్తుపై గెలిచినందునే ఎమ్మెల్యే పదవిని వదులుకుంటున్నట్లు తెలిపారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ కోసం నామినేషన్ వేయడానికి వచ్చిన తనను వద్దన్నారని, అనుచరులను బెదిరించారని ఆరోపించిన రాజాసింగ్ , పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టారు.అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికను రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అధ్యక్షుడిని ఎంపిక చేయడం సరికావని , అందరి అభిప్రాయాలతో అవసరమైతే ఎన్నిక నిర్వహించాలని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
Read More
Next Story