ఈ జిల్లాలో తక్కువ పోలింగ్‌
x

ఈ జిల్లాలో తక్కువ పోలింగ్‌

అన్ని జిల్లాల కంటే తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో నమోదైంది.


రాష్ట్రంలో తక్కువ ఓట్లు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలయ్యాయి. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఈ జిల్లాలో పోలింగ్‌ జరిగింది. సమస్యాత్మక జిల్లాగా ప్రకటించడం వల్ల ఐదు గంటలకు ఎన్నికలు ముగిసాయి. 55.17 శాతం ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌ పర్సెంటేజీలో ఈ జిల్లా అన్ని జిల్లాల కంటే తక్కువ శాతం పోలింగ్‌ నమోదైంది. దీని తరువాత విశాఖ జిల్లాలో 57.42 శాతం పోలింగ్‌ నమోదై రెండో స్థానంలో ఉంది. ఈ జిల్లా పూర్తి స్థాయిలో ఏజెన్సీలో ఉండటం వల్ల గిరిజనులకు సరైన రోడ్డు సౌకర్యాలు లేక సకాలంలో హాజరు కాలేకపోయారు. వయసు మీరిన కొందరు డోలీలతో ఓట్లు వేయడానికి వచ్చారు. అధికారుల నుంచి పూర్తి సహకారం లేదని గిరిజనులు తెలిపారు.


Read More
Next Story