
డీఎస్సీ అభ్యర్థులకు లోకేష్ శుభాకాంక్షలు
మంత్రి నారా లోకేష్ డీఎస్సీ హాల్ టిక్కెట్లను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. మేము ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ హామీ కార్యరూపం దాల్చుతోందని, ఇక మిగిలింది మీ కలలు నెరవేర్చుకోవడమే అని, మంచి ఫలితాలు సాధించి పోస్టులను సొంతం చేసుకోవాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. ఆ మేరకు సోషల్ మీడియా వేదికగా లోకేష్ స్పందించారు. శనివారం డీఎస్సీ హాల్టిక్కెట్లను విడుదల చేసిన ఆయన https://apdsc.apcfss.in, cse.ap.gov.in వెబ్సైట్ల ద్వారా కానీ, 9552300009 వాట్సాప్ ద్వారా కానీ హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టిన తేదీలతో లాగిన్ అయిన తర్వాత హాల్టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
మెగా డీఎస్సీ కింద 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు ఎస్జీటీ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్స్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలు జూన్ 6 నుంచి జూన్ నెలాఖరు 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు ఏపీ డీఎస్సీ హాల్టిక్కెట్, లేటెస్ట్ రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు కానీ, ఓటరు కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. పరీక్షలన్నీ పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. జూలై 8న దీనిని విడుదల చేయనున్నారు. పూర్తి స్థాయి ఫలితాలు జూలై ఆఖరులో విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Next Story