
శ్రీనివాస ఆకలవుతుందా, కాసేపు ఆగవయ్యా..!
తిరుమల శ్రీవారికి ఆలస్యంగా నైవేద్యం గేటు తాళాలు వేసుకుని వెళ్లిపోయిన సెక్యూరిటీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తిరుమల కొండపై ఇప్పటికే అనేకపర్యాయాలు తప్పిదాలు చేసిన విజిలెన్స్ అధికారులు. ఇప్పుడు స్వామివారికి పెట్టే నైవేద్యం విషయంలో నిరక్ష్యంగా వ్యవహరించారు. నైవేద్యాలు తీసుకెళ్లే మార్గంలో గేటుకు తాళం వేయడంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించడం ఆలస్యమైంది. సెక్యూరిటీ సిబ్బంది మధ్య సమన్వయలోపంతో ఇలాంటి తప్పిదం జరిగిందని సమాచారం.
తిరుమల శ్రీవారి ఆలయం వెనక భాగంలో వసంతోత్సమ మండపం మెయిన్ గేట్ కు విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులు తాళం వేసి వెళ్లి పోయారు. పోటు నుంచి ప్రసాదాలను తీసుకొచ్చిన అర్చకులు గేటు వద్ద నిలబడిపోయారు. బరువైన ప్రసాదం గంగాళాలను మోస్తూ. ఎర్రటి ఎండలో అక్కడే నిల్చుకున్నారు. వసంత మండపంలో వంసంతోత్సవాలు జరుగుతున్నాయి. విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యానికి శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story