
కదిలిందీ.. ఎర్రసైన్యం.. కదం తొక్కిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి
ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన కార్మిక మంత్రి వాసంశెట్టి
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి కార్మికునిగా మారిపోయారు. ఆటో డ్రైవర్ డ్రెస్ వేసుకుని మిగతా కార్మికులతో కలిసి కదం తొక్కారు. పాటపాడారు.
"నరాల బిగువూ
కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని,
ప్రపంచభాగ్యం వర్ధిల్లాలని
గనిలో పనిలో కార్ఖానాలో
పరిక్లమిస్తూ
పరిప్లవిస్తూ.."
అని మహాకవి శ్రీ.శ్రీ. చెప్పినట్టుగా కార్మిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ మేడే శుభాకాంక్షలు చెప్పారు. ఆటో డ్రైవర్లతో కలిసి కదం తొక్కారు. పాట పాడారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో మేడే సంబరాల్లో పాల్గొన్నారు. వెల్ల రోడ్డు వంతెన నుంచి ప్రారంభమై లలితానగర్ వరకు సాగిన కార్మికుల ర్యాలీలో ఆయన కార్మికులతో కలిసి ర్యాలీలో పాటలు పాడుతూ కదం తొక్కారు. కార్మికుల భవితకు భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈశ్రమ్ కార్డుల ద్వారా బీమా కల్పిస్తుందని మంత్రి కార్మికులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చంద్రన్న బీమా ద్వారా రూ.10లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి రూ.1,28,000 కోట్లను ఎంఎస్ఎంఈలకు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆటో కార్మికులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. పలువురు కార్మికులను సత్కరించారు.
రాష్ట్రంలో అసలు సిసలైన కార్మికుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని కార్మికశాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో తనతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కార్మికుల కష్టాల గురించి తెలుసన్నారు.
Next Story