సమంతను తన దగ్గరకు పంపమని కేటీఆర్ అడిగారు
x

సమంతను తన దగ్గరకు పంపమని కేటీఆర్ అడిగారు

ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చకూడదంటే సమంతను తన దగ్గరకు పంపాల్సిందే అని కేటీఆర్ కండీషన్ పెట్టారని సురేఖ చెప్పారు.


సమంతను తన దగ్గరకు పంపమని కేటీఆర్ అడిగారు..

సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని నాగార్జున వాళ్ళు ఒత్తిడిపెట్టారు..

కేటీఆర్ దగ్గరకు వెళ్ళటం ఇష్టంలేదని సమంత తెగేసి చెప్పారు..

కేటీఆర్ దగ్గరకు వెళ్ళకపోతే ఇంట్లో ఉండద్దని చెప్పటంతోనే సమంత ఇల్లు విడిచి బయటకు వచ్చేసింది..

ఈ వ్యాఖ్యలు చేసింది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఇపుడు సురేఖ చెప్పిన ఈ మాటలు సంచలనంగా మారాయి. కేటీఆర్ పై బుధవారం ఉదయం నుండి మండిపోతు మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న సురేఖ సాయంత్రం పై వ్యాఖ్యలు చేయటంతో పెద్దఎత్తున కలకలం రేగుతోంది. ఇంతకీ సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని నాగార్జున, చైతన్య ఎందుకు ఒత్తిడి పెట్టారు ? ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చకూడదంటే సమంతను తన దగ్గరకు పంపాల్సిందే అని కేటీఆర్ కండీషన్ పెట్టారని సురేఖ చెప్పారు.

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఎంతోమంది హీరోయిన్ల గుట్టుమట్లను కేటీఆర్ దగ్గర పెట్టుకున్నారట. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాటిల్లో హీరోయిన్ల ఫోన్లు కూడా ఉన్నాయట. ఆ ఫోన్ సంభాషణల ఆధారంగా హీరోయిన్లను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేసినట్లు మంత్రి మండిపడ్డారు. సమంతతో క్లోజ్ గా ఉన్నారు కాబట్టే సమంతను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ నియమించినట్లు చెప్పారు. హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి కేటీఆర్ తన దగ్గరకు పిలిపించుకునే వాళ్ళని కొండా ఆరోపించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేటీఆర్ ఇలాంటి పనులు చేసినట్లు మంత్రి చెప్పారు. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మరికొందరు హీరోయిన్లు కూడా వివాహం చేసుకుని ఫీల్డులో నుండి బయటకు వెళ్ళిపోవటానికి కూడా కేటీఆరే కారణమని మంత్రి ఆరోపించారు. ఆధారాల గురించి అడిగినపుడు ఆధారాలు అవసరంలేదని అందరికీ తెలిసిన విషయాలే అని కొండా సురేఖ చెప్పటం కొసమెరుపు.

Read More
Next Story