జగన్‌ నేడు రెండు జిల్లాల్లో పర్యటన
x

జగన్‌ నేడు రెండు జిల్లాల్లో పర్యటన

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలు పెంచారు. ఈ రోజు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.


మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. గుంటూరుతో పాటు తన సొంత జిల్లా అయిన కడప జిల్లాల్లో ఆయన టూర్‌ చేయనున్నారు. తాడేపల్లి తన ఇంటి నుంచి ఉదయం బయలు దేరి గుంటూరుకు వెళ్లనున్నారు. టీడీపీ కార్యకర్త, రౌడీ షీటర్‌ దుర్మార్గం కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న తెనాలికి చెందిన సుహానా కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. అక్కడ నుంచి మధ్యాహ్నం వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేలుకు వెళ్తారు. బద్వేలులో ప్రేమోన్మాది దాడిలో మరణించిన దస్తగిరమ్మ కుటుంబాన్ని జగన్‌ పరామర్శించనున్నారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రికి పులివెందుల్లోనే బస చేయనున్నారు.

Read More
Next Story