ఏపీలో ఇక వర్షాలే వర్షాలు
x

ఏపీలో ఇక వర్షాలే వర్షాలు

16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు ఎనిమిది రోజులు ముందుగా ప్రవేశించాయి.


ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో నిప్పులు వర్షం కురిపించిన భానుడు చల్లబడ్డాడు. అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కరిబిక్కిరి అయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వాటి నుంచి ఉపశమనం పొందారు. నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. శనివారం నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే ఈ ఏడాది ఎనిమిది రోజులు ముందుగానే ఎంట్రీ ఇచ్చేశాయి. దీంతో ఇక ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో 2009లో కూడా నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే ప్రవేశించాయి.

సహజంగా జూన్‌ మొదటి వారంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ 2009లో ముందుగానే ప్రవేశించాయి. మే 23నే రుతుపనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ ఏడాది కూడా అదే సీన్‌ రిపీటైంది. మే 24న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.

2010 నుంచి నైరుతి రుతుపవనాలు ఎప్పుడెప్పుడు ప్రవేశించాయంటే.. 2010లో మే 31న ఎంట్రీ ఇచ్చాయి. 2011లో మే 29న ప్రవేశించిన రుతుపవనాలు తర్వాత ఏడాది 2012లో జూన్‌ 5న ఎంట్రీ ఇచ్చాయి. 2013లో జూన్‌ మొదటి తారీఖున, 2014లో జూన్‌ 6న, 2015లో జూన్‌ 5న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఇక 2016లో జూన్‌8న, 2017లో మే 30న 2018లో మే 29న కేరళలోకి ప్రవేశించాయి. తర్వాత మూడేళ్లు జూన్‌లోనే ఎంట్రీ ఇచ్చాయి, 2019లో జూన్‌ 8న, 2020లో జూన్‌ 1న, 2021న జూన్‌ 3న రుతుపవనాలు ప్రవేశించాయి. 2022లో ముందుగానే మే 29న కేరళ తీరాన్ని తాకాయి. 2023లో జూన్‌ 8న ప్రవేశించిన రుతుపవనాలు 2024లో మాత్రం మే 30నే కేరళ తీరాన్ని తాకాయి.
Read More
Next Story