
ఐపీఎస్ ఆంజనేయులుకు రిమాండ్ పొడిగింపు
సినీ నటి కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు. తర్వాత గ్రూప్–1 కేసును నమోదు చేశారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.
విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నా డీజీపీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు రిమాండ్ను పొడిగించారు. ఈ నెల 19 వరకు రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకు విధించిన రిమాండ్ గురువారంతో ముగియనుండటంతో విజయవాడ జైల్లో ఉన్న ఆంజనేయులును కోర్టులో హాజరు పరిచారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని, ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని, దీని కోసం మరో సారి విచారించాల్సి ఉందని, అందువల్ల రిమాండ్ను పొడిగించాలని పోలీసులు విజయవాడ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు ఆంజనేయులుకు ఈ నెల 19 వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తిరిగి ఆయనను విజయవాడ జైలుకు తరలించారు.
సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చేసి విజయవాడ జైలుకు తరలించారు. తర్వాత గ్రూప్–1 కేసు తెరపైకొచ్చింది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్–1 మూల్యాంకనంకు సంబంధించి పీఎస్ఆర్ ఆంజనేయులు అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల మీద మరో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణ ఇప్పటికే చేపట్టారు పోలీసులు. అయితే విచారణ సమయంలో పీఎస్ఆర్ ఆంజనేయులు సరిగా సహకరించలేదని, సమాధానాలు సరిగా చెప్పలేదని, దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్పారనే ఆరోపణలు పీఎస్ఆర్ ఆంజనేయులు మీద వచ్చాయి. మరో వైపు గురువారంతో ఆయన రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆంజనేయులును కోర్టులో హజరు పరిచారు. మరో సారి ఆంజనేయులును విచారణ చేపట్టాల్సి ఉందని, అందువల్ల రిమాండ్ను పొడిగించాలనే పోలీసుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ను ఈ నెల 19 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరో పీఎస్ఆర్ ఆంజనేయులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గుండెకి సంబంధించిన సమస్యతో పాటు బీపీతో కూడా సతమతమవుతున్నారు. ఇటీవల రెండు సార్లు ఆయనకు బీపీ స్థాయిలో పడిపోవడంతో విజయవాడ జీజీహెచ్కు తరలించి వైద్య చికిత్సలు కూడా అందించారు. బుధవారం కూడా ఆయనకు సాయంత్రం వరకు వైద్య సేవలు అందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Next Story