
5.78లక్షల కోట్ల పెట్టుబడులు–57.7గిగావాట్లు ఉత్పత్తి
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్పై ఏపీ ప్రభుత్వం–నీతి ఆయోగ్, ఐఎస్ఈజీ ఫౌండేషన్ మధ్య సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఆ మేరకు శరవేగంగా అడుగులేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీని తెరపైకి తెచ్చింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు ప్రత్యేకించి దీనిపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఇటీవల మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లాలో రూ. 22వేల కోట్ల రెన్యూ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్కు శంకుస్థాపన కూడా చేశారు. పోయిన నెల 16న అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజక వర్గం బేతపల్లి గ్రామంలో రెన్యూ పవర్ సంస్థ స్థాపించనున్న రూ. 22వేల కోట్ల విలువైన 4.8 గిగావాట్ల హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. వీటిల్లో టాటాపవర్, ఎన్టీపీసీ, వేదాంత సెరెంటికా, ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చాయని వెల్లడించారు,