
దమ్ముంటే కాపు రిజర్వేషన్లు అమలు చేయండి
ముద్రగడ తన కుమార్తెకు, ఆమె కుటుంబానికి ఒక సవాలు విసిరారు. ఆ మేరకు సోమవారం బహిరంగ లేఖ రాశారు.
ముద్రగడకు, తన కుమార్తెకు, ఆమె కుటుంబానికి మధ్య వైరం కొనసాగుతోంది. ఎన్నికల ముందు మొదలైన ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు పెరిగి పెద్దవై తీవ్ర రూపం దాల్చాయి, దీంతో ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గు మంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ముద్రగడ కుమార్తె క్రాంతి బహిరంగంగా కొన్ని కామెంట్లు చేశారు. తన తండ్రి ముద్రగడకు ఆరోగ్యం సరిగా లేదని, తన సోదరుడు తండ్రి ముద్రగడను సరిగా చూడటం లేదని, ఆ విషయాలు తెలుసుకుందామంటే ఎవరూ సహకరించడం లేదని క్రాంతి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తండ్రి ముద్రగడ స్పందించారు. కుమార్తె క్రాంతి మీద, ఆమె కుటుంబం మీద విమర్శలు గుప్పించారు. ఇది కావాలనే వారు ఆడుతున్న నాటకంగా పేర్కొన్నారు. ఆ మేరకు ముద్రగడ ప్రజలకు సోమవారం ఒక బహిరంగ లేఖ రాశారు.
అందులో ముద్రగడ ఏమన్నారంటే..
ఈ మధ్య తమ కుంటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తోంది. ఆ కుటుంబానికి తమ కుటుంబానికి ఎలాంటి సంబందాలు లేవు. తమకు వాళ్లకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్థలు వచ్చాయి. ఏడాది కాలంగా అన్ని రకాల రాకపోకలు బం«ద్ అయ్యాయి. ఇప్పుడు వారి జోలికి తాను వెళ్లడం లేదని, అయినా తమను వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. తమ చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో వారు రగిలిపోతుండటమే దీనికి కారణమని అంటూ పరోక్షంగా తన కుమార్తె కుటుంబం గురించి ముద్రగడ పేర్కొన్నారు.
ఇంకా తన లేఖను కొనసాగిస్తూ.. తనకు కేన్సర్ వచ్చిందని, ఇంట్లో తనను బంధించి తన చిన్న కొడుకు, అతని మామ తనను పట్టించుకోవం లేదనే బాధాకరమైన మాటలు అంటున్నారు. తనకు అలాంటి సమస్యలేమీ లేవని, ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం తన చిన్న కొడుకే అని ముద్రగడ వెల్లడించారు. తన చిన్న కొడుకు తనకు అన్ని సేవలు చేసిన తర్వాతే బయటకు వెళ్తడని పేర్కొన్నారు. తన చిన్న కొడుకు నుంచి తనను దూరం చేస్తే తాను తన కుమార్తె ఇంటికి వస్తానని, వారి అడుగులకు మడుగులొత్తతానని తన కుమార్తె కుటుంబంం అనుకుంటుందేమో అని, అది ఈ జన్మకే కాదు.. ఎన్ని జన్మలెత్తిన ఆ ఇంటికి తాను వెళ్లడం జరగదని ముద్రగత స్పష్టం చేశారు.
గతంలో తన భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని సుమారు 15 రోజుల తర్వాత హాస్పిటల్ నుండి విశ్రాంతి కోసం వాళ్ల ఇంటికెళ్తే ఇంటి నుంచి బయటకు పంపేశారని, ఆ విషయం వారు మరిచిపోయినా.. తాను మరవలేదని ముద్రగడ తన కుమార్తె కుటుంబం గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవు. తాను వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నాను, తన ఇంటికి వచ్చే ప్రజలతో కలుస్తున్నాను. అంతేతప్ప తనను ఇంట్లో బంధించి ఉంచడం కానీ, మానసికంగా హింసించడం కానీ లేదని ముద్రగడ స్పష్టం చేశారు. ఆ కుటుంబానికి దమ్ము, ధైర్యం ఉంటే కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని, ఆ మేరకు సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొని రావాలని తన కుమార్తె క్రాంతి, ఆమె కుటుంబానికి ముద్రగడ సవాలు విసిరారు. దీంతో పాటుగా సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయించాలని తన కుమార్తె కుటుంబానికి ముద్రగడ సవాలు విసిరారు.
Next Story