అధికారం టీడీపీ దగ్గరుంటే..జనం జగన్‌ దగ్గరున్నారు
x

అధికారం టీడీపీ దగ్గరుంటే..జనం జగన్‌ దగ్గరున్నారు

రాజకీయాల్లో డ్రామాలు, నాటకాలు సీఎం చంద్రబాబుకే చెల్లు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.


అధికారం టీడీపీ వద్ద ఉంటే, జనం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దగ్గర ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాప్తాడులో హత్యకు గురైన వైసీపీ నాయకుడు కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే జగన్‌ మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో డ్రామాలు, నాటకాలు ఆడాలంటే చంద్రబాబు నాయుడికి మించిన వారు లేరని, చంద్రబాబు సంస్కారం ఏంటో అనేది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బాగా తెలుసన్నారు.

జగన్‌ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ప్రయాణించిన హెలికాప్టర్‌ మీదకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలే ప్రజలను పంపారని మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఇవేం మాటలు అంటూ ప్రశ్నించారు. హెలికాప్టర్‌ వద్దకు ప్రజలు వెళ్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మామ ఎన్టీఆర్‌ను వెన్ను పోటు పొడిచి, క్యాంపులు పెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, కానీ తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ అలా కాదని, జగన్‌ అభిమన్యుడు కాదని, అర్జునుడు వంటి నాయకుడని, చంద్రబాబు కుట్రలను తీచ్చి చెండాడుతాడని మాట్లాడారు.

జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్నో రకాల డ్రామాలు ఆడారో రాష్ట్ర ప్రజలకు తెలుసని, శరీరంపై పొక్కులు వచ్చాయని, డీహైడ్రేషన్‌ వచ్చిందనీ, దోమలతో కుట్టించి చంపే ప్రయత్నం చేశారంటూ అనేక రకాల డ్రామాలాడారని ఎద్దేవా చేశారు. హెలికాప్టర్‌ ఘటనలో ఎందుకంత అబద్దాలు చెబుతున్నారు, డీసీజీఏ కూటమి ప్రభుత్వం నియంత్రణలోనే ఉంది కదా? వారి వద్ద నుంచి జగన్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ పరిస్థితి ఏంటనేది రిపోర్టు తెప్పించుకోవచ్చు కదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఖాకీల్లో 90 శాతం మంది జాగ్రత్తగానే పని చేస్తున్నారని, కానీ తక్కిన 10 శాతం మందే దిగజారి టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఖాకీ చొక్కా పరువు తీస్తున్న పోలీసులు ఆ ఉద్యోగాలకే అనర్హులు అంటూ మండిపడ్డారు. తోపుతుర్తి ప్రకాష్‌రెడ్డి చేతికి మైక్‌ ఇచ్చి ప్రజలను కంట్రోల్‌ చేయించి, తిరిగి ఆయన మీదే కేసులు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలికి సిగ్గూ ఎగ్గూ లేవన్నారు. కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని, కేంద్రమే జగన్‌ ప్రాణాలకు రక్షణ కల్పించాలని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు గుడులకు కూల్చితే.. జగన్‌ హైందవ ధర్మాన్ని నిలబెట్టారని, టీటీడీ గోశాలలో గోవులు మరణిస్తే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
Read More
Next Story