అమరావతి వేదికపై ఎంత మంది ఉంటారు?
x

అమరావతి వేదికపై ఎంత మంది ఉంటారు?

అమరావతి వేదికపై మొత్తం 14 మంది ఉంటారు. ఎవరెవరు ఉంటారనేది ఎష్పీజీ వారు నిర్ణయిస్తారు.


అమరావతిలో జరిగే రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాన వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సహా మొత్తం 14 మంది ఆసీనులవుతారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా వేదికపై ఉండే అవకాశం ఉంది.

స్టానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రొటోకాల్ ప్రకారం పాల్గొనే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్మి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. మరికొందరు మంత్రులు కూడా వేరొక వేదికపై కూర్చొనే అవకాశం ఉంది. రాజధానికి భూములు ఇచ్చిన 30 మంది రైతులు మరో వేదికపై కూర్చొనే అవకాశం కల్పించారు.

సభా ప్రాంగణం పూర్తిగా ఎస్పీజీ వారి కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. వేదికపైకి ఎక్కి బరువుకు వేదిక ఆగుతుందా లేదా అని ఎస్పీజీ వారు పరిశీలించారు. పరిసరాలను పూర్తిగా పరిశీలించారు. వేదిక చుట్టూ ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకున్నారు. వేదికపై ఎంత మంది ఉండాలి. ఎవరెవరు ఉండాలనేది కూడా వారే నిర్ణయిస్తారు.

Read More
Next Story