వక్ఫ్‌ బిల్లుపై ఎంత మంది పిటీషన్‌లు వేశారంటే
x

వక్ఫ్‌ బిల్లుపై ఎంత మంది పిటీషన్‌లు వేశారంటే

నేడు సుప్రీం కోర్టు విచారించనున్న నేపథ్యంలో దీని మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


ఇటీవల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన వక్స్‌ సవరణ చట్టం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అనేక ఎత్తుగడల మధ్య ఈ బిల్లును మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చాకచక్యంగా ఆమోదింపచేసుకుంది. అయితే దీనిపై అటు ప్రతిపక్షాలు, ఇటు ముస్లిం వర్గాలు, ప్రజాస్వామిక వాదులు, వామపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. అయినా తగ్గేదేలేదంటూ మోదీ ప్రభుత్వం ముందుకెళ్లింది. ఈ నేపథ్యంలో వక్ఫ్‌ సవరణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారు సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. ఈ బిల్లు రాజ్యాంగం విరుద్దమంటూ మోదీ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా పలువురు సుప్రీం కోర్టులో పిటీషన్‌లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యతక సంతరించుకున్న ఈ పిటీషన్‌ మీద ఈ రోజు (ఏప్రిల్‌ 16 బుధవారం) సుప్రీం కోర్టు విచారణ చేపట్ట నుంది. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుప నుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దీనిపై ఉత్కంఠత నెలకొంది.

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగానికి విరుద్దమని, ఇది జాతీయ సమగ్రతకే భంగం కలిగించేలా విధంగా ఉన్నాయంటూ ఎంఐఎం అధ్యక్షులు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో సహా మొత్తం 70 పిటీషన్లు సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. ఈ చట్టం ముస్లిం మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వక్ఫ్‌ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ పేర్కొంది.
ఈ పిటీషన్లంటిని కలిపి ఉమ్మడిగా ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్ట నుంది. ఎంఐఎంతో పాటు కాంగ్రెస్, జేడీయూ, ఆప్, డీఎంకేజ సీపీఐ, సీపీఎం వంటి ప్రతిపక్ష పార్టీలతో పాటు జమైత్‌ లేమా హింద్, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వంటి పలు సంస్థలు కూడా సుప్రీం కోర్టులో పిటీషన్‌లు దాఖలు చేసిన వారిలో ఉన్నాయి. అయితే భారత దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ బిల్లుకు మద్దతు తెలుపుతూ సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశాయి. మోదీ ప్రభుత్వం తెచ్చిన ఈ వక్ఫ్‌ బిల్లు రాజ్యాంగానికి విరుద్దమని శిష్ణు శంకర్‌ జైన్‌ అనే సీనియర్‌ న్యాయవాది కూడా సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.
Read More
Next Story