
మచిలీపట్నం పోర్ట్ ఆసక్తికర చరిత్ర మీకు తెలుసా?
మసులా బీచ్ ఫెస్ట్ సందర్బంగా ప్రత్యేక కథనం
ప్రెంచ్, డచ్, బ్రిటీష్, నిజాంలు, మరెందరో రాజుల పాలనలో వ్యాపార కేంద్రంగా ఓ వెలుగు వెలిగిన ఓడరేవు మచిలీపట్నం(machilipatnam port) . ఒకప్పటి మసులాపట్నంమే ఇప్పుటి ఈ మచిలీపట్నం.గతమెంతో ఘనచరిత్ర వున్న ఈ మసులా రేవు మూడు రోజుల బీచ్ ఫెస్ట్ (masula beach festival )జరుపుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా గతంలో ఘనచరిత్ర వున్న మసులా బీచ్ ఫెస్ట్ తో పర్యాటకం అభివృద్ది మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది.
మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరంలో మసులా బీచ్ ఫెస్ట్ 2025 - 8వ తేది వరకు జరుగుతోంది.ఎంతో అట్టహాసంగా దక్షిణ భారత దేశం లోనే అతి పెద్ద ఉత్సవంగా సాగే మసులా బీచ్ ఫెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నం పోర్ఠ్ శతాబ్దాల చరిత్ర ను తెలుసుకొని తీరాల్సిందే. తూర్పు తీరంలో మద్రాసు (చెన్నై) కంటే ముందే అంతర్జాతీయ ఓడరేవు గా విలసిల్లిన రేవు మసుల.
మసులా (మచిలీపట్నం)చరిత్ర మీకు తెలుసా?
మచిలీపట్నం,బందరు, మసులా ఇలా ఇప్పటికే పురాతన పేర్లు చరిత్రను గుర్తుచేస్తున్నాయి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో శాతవాహన రాజుల కాలం నుండి మసులా రేవు ఉనికిలోకి వచ్చింది. ఆ కాలంలో బందర్ను మైసోలోస్, మసాలియా అని కూడా పిలిచేవారు.మచిలీపట్నంలోని అనేక ప్రాంతాలకు ఇప్పటికీ డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, నిజాం నవాబుల పేర్లు ఉన్నాయి. అనేక స్మారక చిహ్నాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 15వ శతాబ్దానికి ముందు ఈ రేవు గురించి స్పష్టమయిన ఆధారాలు తక్కువ. అయితే, 1560 నుంచి ఈ రేపు వ్యాపారం గురించి చాలా స్ఫష్టమయిన రికార్డులున్నాయి. నిజానికి ఆరోజుల్లో భారత్ తూర్పు తీరంలో విదేశీ వర్తకానికి అలంబనగా నిలిచిన ఓడరేవు ఇదొక్కటే. దిగువన మద్రాసుకంటే, ఎగవన కలత్తా కంటే కూడు ముందే భారత్ గ్లోబలైజ్ చేసిన ఓడరేవు ఇది.
గోల్కొండ రాజ్యం సంపదతో తులతూగేందుకు బాట వేసిన రేవు కూడా ఇదే. ఈ రేవు గోల్కొండ రాజ్యంలోని కాబట్టి గొల్గొండ గ్లోబలైజ్ చేసి రేవు ఇది ప్రఖ్యాత ఆర్థిక వేత్త సంజయ్ బారు రాశారు. హైదరాాబాద్ చార్ మినార్ నుంచి నాలుగు వైపుల నాలుగు గేట్లు ఉంటాయి. అందులు తూర్పు వైపున ఉన్న గేట్ మసుల రేవుతో కలిపై జాతీయ రహదారి గేటు. గొల్కొండ నుంచి వజ్రాలు, వస్త్రాలు , బియ్యం ఎగుమతయ్యేవి, ఇండోనేషియాతో మలయా, బర్నా వంటి దేశాలకు ఒకవైపు, అరబ్ దేశాలకు మరొక గొల్కొండతో వ్యాపారా సంబంధాలుండేవి. అంతెందుకు అరబ్ వర్తకులే మచిలీ పట్నం ఓడరేవు ఏర్పాటు కు కారణమని కూడా చెబుతారు.
ఐదు శతాబ్దాల వ్యాపార కేంద్రంగా బందరు పోర్టుకు గుర్తింపు ఉంది.ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.1478లో మహమ్మద్ షా బహమనీ II ఆధీనంలోకి మసులా (bandar port )వచ్చింది. ఆ తరువాత 1515లో శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తరవాత కాలంలో బందర్ ను గోల్కొండ నవాబు కులీ కుతుబ్ షా స్వాధీనం చేసుకున్నారు.అయితే, 1580-1590 ల మధ్య గోవా , కుతుబ్ షాహి పాలకుల మధ్య ఒక రకమైన సంధి ఏర్పడింది. 1590 ఒప్పందం ప్రకారం, గోల్కొండ సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రతి సంవత్సరం సిలోన్లోని పోర్చుగీస్ సైన్యానికి సుమారు 300 ఖాండీల బియ్యం ( 10,000 కిలోలు) ఓడను పంపడానికి అంగీకరించాడు. అప్పుడే మరొక ప్రధాన సంఘటన చోటుచేసుకుంది.. మసులిపట్నం ,ఎర్ర సముద్రం, మక్కా మధ్య ఒక లింక్ ఏర్పడింది. దాంతో ఉత్తర కోరమండల్ , అంతర్గత ఆంధ్ర (వరంగల్ సమీపంలో) నుండి వస్త్రాలకు అదనపు డిమాండ్ ఏర్పడింది, ఇది వాణిజ్యంలో ఇప్పటికే ప్రాధాన్యత కలిగిన అంశం. కానీ ఇప్పుడు మసులిపట్నం నుండి ఎర్ర సముద్రం ద్వారా పర్షియన్ గల్ఫ్కు వస్త్రాల ఎగుమతికి డిమాండ్ ఉంది.
విదేశీ వ్యాపారుల చేతిలోకి బందరు పోర్ట్
గోల్కొండ రాజులు(golkonda) ఢిల్లీ చక్రవర్తి చేతిలో ఓడిపోయిన తరవాత, విదేశీ వ్యాపారులు ప్రవేశించారు. తరచూ యుద్ధాలు, విపత్తుల కారణంగా మచిలీపట్నం అభివృద్ధికి గండి పడింది. 1779లో పెనుతుపాను మచిలీపట్నాన్ని అతలాకుతలం చేసింది.
యూరోపియన్ వ్యాపారులు, ముఖ్యంగా పోర్చుగీస్, డచ్ వ్యాపారులు తమ వాణిజ్య కేంద్రాలను బందరులో స్థాపించారు. బ్రిటీష్ వారు ఓడరేవుకు వచ్చి 1611లో తమ ఫ్యాక్టరీని స్థాపించారు.నాడు ప్రధాన ఓడరేవుగా బ్రిటీష్, ఫ్రెంచి,డచ్ వారి వాణిజ్యం కేంద్రంగా బందర్ ఒక వెలుగు వెలిగింది. ఐరోపా, ఆగ్నేయాసియా, ఆగ్నేయ దేశాలతో వాణిజ్యం చేసే వారిని మచిలీపట్నం ప్రధాన ఓడరేవుగా ఉండేది. మచిలీపట్నం రేవు నుంచి ముఖ్యంగా వజ్రాలు, సుగంధ ద్రవ్యాలు, మస్లిన్ వస్త్రం, కలంకారీ బట్టలు, పొటాషియం నైట్రేట్ ఎగుమతి చేసేవారు.
ఈస్టిండియా కంపెనీ కోరమాండల్ తీరంలో తమ మొదటి వ్యాపార స్థావరం ఏర్పాటు చేయడంతో మచిలీపట్నం వలస పాలనలో మళ్లీ ఓ వెలుగు వెలిగింది. డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీషు, పోర్చుగీస్ వ్యాపారులు మచిలీపట్నం నుంచి వాణిజ్యం కొనసాగించారు.
మతాలకు అతీతంగా బందరు నగరం
1602లో డచ్ (duch)వారు హాలండ్ నుండి సముద్ర మార్గం గుండా మచిలీపట్నంలోకి ప్రవేశించి బందరులోని మాచవరంలో స్థిరపడ్డారు. హాలండ్ నుండి వచ్చిన వ్యాపారులను హొలండేయులు, హొలందేయ అని పిలిచేవారు. ఇది వొల్లందేయగా మారింది. ఆ తరువాత అది కాలక్రమేనా వొల్లండేయపాలెంగా మారింది. ఈ గ్రామంలో ఇప్పటికీ డచ్ స్మశానవాటిన ఆనవాళ్లు ఉన్నాయి.
1756లో ప్యారిస్ నుండి మచిలీపట్నం వచ్చిన ఫ్రెంచి వర్తకుల పేరు మీదుగా పరసుపేట ఏర్పడింది. ఫ్రాన్స్ నుండి వచ్చిన వారిని ఫరాసులు లేదా పరశులు అని పిలిచేవారు. బ్రిటీషర్లు ప్రధానంగా రంగేజ్ పాలెంలో నివసించేవారు. ముస్లిం జనాభా దీనిని ఆంగ్లేజులు అని పిలిచేవారు. బ్రిటీష్ వారి ప్రవేశంతో కాలక్రమేణా ఇంగ్లీషు పాలెం అనే పేరు వచ్చింది. ఈ పేరు ఇప్పటికీ ఉంది.
ఈ ఓడరేవు ప్రాంతంలో అప్పట్లో బహుళ జాతి,భాషా సమూహాలు ఉన్నాయి, మంగోలులు, టర్కులు, పర్షియన్లు,అరబ్బులు, చులియా (తమిళ) ముస్లింలు, గోల్కొండ ముస్లింలు, తెలుగువారు, ఒడియాలు, అరకనీస్, పెగువాన్లు, అచెనీస్, మలేయ్లు, జావనీస్, ఇంగ్లీష్, డచ్, డేన్స్, ఫ్రెంచ్, యూదులు, పఠాన్లు, అర్మేనియన్లు, కన్నడలు కలిసి వుండేవారు. పట్టణం మత సామరస్యాన్ని ఆస్వాదించింది. ఈ పట్టణం వెలుగు వెలిగిన కాలంలో బందర్-ఇ ముబారక్ అని పిలువబడింది, కానీ పదహారవ శతాబ్దం చివరిలో ప్రాముఖ్యతను సంతరించుకున్న బందరు పోర్టు ప్రాంతం , పద్దెనిమిదవ శతాబ్దంలో అభివృద్దికి దూరంగా ప్రాభవాన్ని కోల్పోయింది.
మచిలీపట్నం 50 మైళ్ల వ్యాసార్థంలో నేత గ్రామాలతో కూడి వుంటుంది. ఓడరేవు దాని ఉప్పునీటి కుంటలకు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది, అందుకే అప్పట్లోనే ఉప్పు నగరం యొక్క ఎగుమతులలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. పదిహేడవ శతాబ్దంలో ఉప్పు ఎగుమతుల నుండి మసులిపట్నం వార్షిక ఆదాయం 41,000 పగోడాలు. ఇది తీరప్రాంత మార్గం ద్వారా బెంగాల్కు , దక్షిణం వైపుకు ఎద్దుల లోడ్లపై లంబాడి వ్యాపారుల కారవాన్ల ద్వారా లోతట్టు ప్రాంతాలకు ఎగుమతి చేశారు.ఆసక్తికరంగా, గోల్కొండ సుల్తానులు, యూరోపియన్ కంపెనీలు ఎప్పుడూ పట్టణాన్నిఅభివృద్ది చేయడానికి ప్రయత్నించలేదు. తీరప్రాంత రక్షణ కోసం వినియోగించలేదు.
కీలక సముద్ర తీరంగా బందరు రేవు
కోరమండల్ తీరంలోని అనేక ఇతర ఓడరేవుల మాదిరిగానే ఇది కూడా ఒక ఓపెన్ రోడ్స్టెడ్ ఓడరేవు, ఇది బంగాళాఖాతంలో ఉత్తమ లంగరు వేసే స్థలం. ఇసుక, బురద మిశ్రమంతో కూడిన దృఢమైన నేల ఉంది, తీరం నుండి 4 మైళ్ల వరకు ఈ నేల అందుబాటులో ఉంది, ఇక్కడ 1000 టన్నుల వరకు బరువున్న ఓడలు సురక్షితంగా లంగరు వేయగలవు.జూన్ , జూలై నెలల్లో పశ్చిమ రుతుపవనాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, బంగాళాఖాతంలో గాలులు బలంగా ఉన్నప్పుడు మసులిపట్నం ఉత్తరాన ఉన్న అఖాతం ఓడలకు సురక్షితమైన లంగరు వేసే ప్రాంతంగా వుంటోంది.ఆగ్నేయ తీరంలో (ఆంధ్రప్రదేశ్) ఓడరేవుగా , ఇది కృష్ణ నది , దాని ఉపనదులు బంగాళాఖాతంలోకి కలిసే ప్రాంతంగా వుంది. ఈ ఉపనదులు కృష్ణా డెల్టాను, ఒండ్రు మైదానంగా ఏర్పరుస్తాయి. నది యొక్క ఒక శాఖ పండిట్ దివి వద్ద సముద్రంలోకి వస్తుంది, పండిట్ దివి మసులిపట్నంలోకి ప్రయాణించే ఓడలకు ఒక ముఖ్యమైన నావిగేషనల్ మార్క్.నౌకా వాణిజ్యానికి ఎంతో అనువైన పోర్ట్గా వున్న మచిలీ పట్నానని మరింతగా అభివృద్ది చేయడానికి ఇప్పుటి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.
మూడు రోజుల బీచ్ ఫెస్టివల్ (MASULA BEACH FEST)
మచిలీపట్నం గత వైభవాన్ని గుర్తు చేసుకుంటూ 'మసులా బీచ్ ఫెస్టివల్ - 2025'ను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ, కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది.బీచ్ ఫెస్టివల్లో భాగంగా 8వ తేదీ వరకు నేషనల్ వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహించనున్నారు.దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద ఈవెంట్గా మసులా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. ఎమ్యూజ్ మెంట్, ఎంటర్ టైన్మెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తున్నారు. హెలీ రైడ్, పారా గ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్ సీ, బంగీ లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేశారు. 60 అడుగుల ఎత్తులో అమరావతి అసెంబ్లీ నమూనాతో ఏర్పాటు చేసిన గేట్ వే ఆఫ్ అమరావతిని ఆవిష్కరించారు.ఈ ఈవెంట్ ద్వారా ఆ ప్రాంతంలో , రాష్ట్రంలో మరింత పర్యాటక రంగ అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.