ఏపీలో 15 శాతం గ్రోత్‌ రేట్‌ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి
x

ఏపీలో 15 శాతం గ్రోత్‌ రేట్‌ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి

గత అయిదేళ్లలో ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధి రేట్‌ తగ్గింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలి. సీఎం అధికారులకు ఆదేశాలు.


ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది 15 శాతం గ్రోత్‌ రేట్‌ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిపై సచివాయలంలో సమీక్ష నిర్వహించారు. గత పభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయన్నారు. నేడు ప్రతిశాఖలో కొత్త పాలసీలు తీసుకువస్తున్నామన్నారు. వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని, ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యమన్నారు. 2014 తరువాత రాష్ట్రం 13.7 శాతం గ్రోత్‌ రేట్‌ సాధించిందన్నారు. వైసీపీ ప్రభుత్వ రివర్స్‌ నిర్ణయాలతో వృద్ధి రేటు 10.59 శాతానికి తగ్గిందన్నారు.

2014–15 మధ్య తలసరి ఆదాయం రూ.93,903 ఉండగా, 2019 నాటికి రూ.1,54,031 పెరిగిందన్నారు. టీడీపీ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి 13.21 శాతం ఉండగా, గత ప్రభుతంలోప్రభుత్వంలో అది 9.06 శాతం మాత్రమే నమోదు అయ్యిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఏపీ 5వ స్థానంలో ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్ధిష్ట లక్ష్యాలతో పనిచేయాలని సూచించారు. కొన్ని శాఖలు బాగా వెనకబడి ఉన్నాయని, వారు యాక్టివ్‌ కావాల్సిన అవసరం ఉందని సూచించారు. త్వరలో ఈ మూడు రంగాల్లో లక్ష్యాలపై ప్రణాళికలతో రావాలని సిఎం అధికారులను ఆదేశించారు. జనవరిలో పి4 విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నామన్నారు. ఈ విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు, ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10 శాతం మందని పైకి తెసుకువచ్చేందుకు సహాయం చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు, సంపన్నులు, సంస్థలు సీఎస్‌ఆర్‌ ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి, వారికి అవకాశాలు కల్పించడానికి మెంటార్‌ లా దోహద పడాలన్నారు.


Read More
Next Story