వచ్చే ఏడాదికి నాలుగు పోర్టులు, హార్బర్లు
x

వచ్చే ఏడాదికి నాలుగు పోర్టులు, హార్బర్లు

పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, హార్బర్ల మీద సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.


వచ్చే ఏడాది డిసెంబర్‌కు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట మొదటి దశ పనులు, అదేవిధంగా కాకినాడ గేట్‌వే పోర్టు పనులు కూడా పూర్తి కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల మొదటి దశ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం తన ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, హార్బర్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన కుప్పం, దగదర్తి, అమరావతి, శ్రీకాకుళం(పలాస) ఎయిర్‌ పోర్టుల నిర్మాణం ముందు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కలిపి 20కి తగ్గకుండా చూడాలని, అలాగే 14 ఎయిర్‌ పోర్టులు ఉండేలా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ రాష్ట్ర రహదారులను విస్తరించాలని అధికారులను ఆదేశించారు. వీటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్నీ ప్రాంతాల్లో టూరిజమ్‌ అభివృద్ధి చెందేలా హెలీపోర్టుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Read More
Next Story