
మంగళగిరి కోర్టుకు మాజీ ఎంపీ నందిగం సురేష్
వచ్చే నెల 2 వరకు నందిగం సురేష్కు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యకర్తపై దాడి చేశారని సురేష్ మీద కేసు నమోదు చేశారు.
బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నాయకుడు నందిగం సురేషన్ను సోమవారం ఉదయం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన మంగళగిరి కోర్టు నందిగం సురేష్కు వచ్చే నెల 2 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నందిగం సురేష్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. నందిగం సురేష్ మీద రెండు రోజుల క్రితం పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇసకపల్లి రాజుపై దాడికి పాల్పడ్డారని రాజు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగం సురేష్ మీద మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన సురేష్ను సోమవారం మంగళగిరి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అంతకు ముందు నందిగం సురేష్ను మంగళగిరి ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వంచారు. బీపీ, సుగర్తో పాటు ఇతర పరీక్షలు కూడా చేశారు.