మంగళగిరి కోర్టుకు మాజీ ఎంపీ నందిగం సురేష్‌
x

మంగళగిరి కోర్టుకు మాజీ ఎంపీ నందిగం సురేష్‌

వచ్చే నెల 2 వరకు నందిగం సురేష్‌కు రిమాండ్‌ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యకర్తపై దాడి చేశారని సురేష్‌ మీద కేసు నమోదు చేశారు.


బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నందిగం సురేషన్‌ను సోమవారం ఉదయం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన మంగళగిరి కోర్టు నందిగం సురేష్‌కు వచ్చే నెల 2 వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నందిగం సురేష్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. నందిగం సురేష్‌ మీద రెండు రోజుల క్రితం పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇసకపల్లి రాజుపై దాడికి పాల్పడ్డారని రాజు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగం సురేష్‌ మీద మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన సురేష్‌ను సోమవారం మంగళగిరి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అంతకు ముందు నందిగం సురేష్‌ను మంగళగిరి ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వంచారు. బీపీ, సుగర్‌తో పాటు ఇతర పరీక్షలు కూడా చేశారు.

అయితే నందిగం సురేష్‌ను మంగళగిరి కోర్టులో హజరు పరిచే సమయంలో భారీ స్థాయిలో అతని కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, అనుచరులు, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు చేరుకుంటారనే ముందస్తు సమాచారంతో కోర్టు ప్రాంగణంలో భారీగానే పోలీసు బందోబస్తు చేపట్టారు. పోలీసులు భావించినట్టుగానే అక్కడికి భారీగానే నందిగం సురేష్‌ అనుచరులు చేరుకున్నారు. అయితే వారిని కోర్టు ప్రాంగణం నుంచి పోలీసులు బయటకు వెళ్లగొట్టారు. ఈ కేసు మీద మంగళగిరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, నందిగం సురేష్‌కు ఎన్ని రోజులు రిమాండ్‌ విధిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
Read More
Next Story