మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
x

మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. విజయ డెయిరీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె రాజకీయాల్లో కూడా రాణించారు


మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. విజయ డెయిరీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె రాజకీయాల్లో కూడా బాగా రాణించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్‌టీరామారావు కేబినెట్‌లో ఆమె విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. గత కొన్ని రోజులుగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు వెల్లడించారు. ఆమె మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలుపుతున్నారు.

ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు

సీతాదేవి మరణంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆమె విద్యారంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆ రంగంపై తన చెరగని ముద్రవేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.

Read More
Next Story